News April 10, 2024
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును కేసీఆర్ ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత సాయన్న కుమార్తెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ స్థానంలో మే 13న ఉపఎన్నిక జరగనుంది.
Similar News
News November 17, 2025
1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

TG: 1,260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును మెడికల్&హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 24,045 మంది దరఖాస్తు చేయగా, 23,323 మంది పరీక్ష రాశారు. కాగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్టును సెపరేట్గా రిలీజ్ చేస్తామని MHSRB వెల్లడించింది. వికలాంగుల కోటాలో దరఖాస్తుదారులు లేకపోవడంతో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఫలితాల కోసం <
News November 17, 2025
షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాను ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) దోషిగా తేల్చింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారని, 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ICT ఆధారాలను నిజమైనవిగా పరిగణించి దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్ఠశిక్ష పడుతుందని పేర్కొంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తీర్పును పట్టించుకోనని హసీనా అన్నారు.
News November 17, 2025
HYDలో పెరుగుతున్న విడాకుల కేసులు!

యువత చిన్న సమస్యలు, గొడవలకే విడాకులు తీసుకుంటోంది. ఈ కల్చర్ హైదరాబాద్లో పెరుగుతోంది. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతినెలా సుమారు 250 విడాకుల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 25 – 35 ఏళ్ల మధ్య ఉన్న జంటలు చిన్న కారణాలకే డివోర్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. యువ జంటలు సహనం, సర్దుబాటు, కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇచ్చి చిన్న సమస్యలకే కోర్టు మెట్లెక్కకుండా వివాహ బంధాన్ని కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.


