News June 23, 2024

అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించాలని వినతి

image

AP: అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అడిగినట్లు పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్ట్, రైల్వే జోన్‌కు సహకారం అందించాలని కోరామన్నారు.

Similar News

News October 16, 2025

2026 టీ20 WC.. జట్లు ఖరారు

image

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 WCకు UAE అర్హత సాధించింది. దీంతో టోర్నీలో పాల్గొనే మొత్తం 20 జట్లు ఖరారయ్యాయి. ఇండియా, శ్రీలంక, AFG, AUS, బంగ్లా, ENG, SA, USA, WI, ఐర్లాండ్, NZ, PAK, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, ZIM, నేపాల్, ఒమన్, UAE జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అందులో నుంచి 4 టీమ్స్ సెమీస్ ఆడతాయి.

News October 16, 2025

IPS ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

image

పంజాబ్‌లోని రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్‌చరణ్ సింగ్ భుల్లర్‌ను CBI అరెస్ట్ చేసింది. ₹8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్‌చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి ₹5Cr నగదు, 1.5kgs జువెలరీ, 22 లగ్జరీ వాచ్‌లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్&పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రేపు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.

News October 16, 2025

తాలిబన్లు మనకు శత్రువులా?

image

<<18023858>>అఫ్గానిస్థాన్‌<<>>లోని తాలిబన్లు నిరంతరం యుద్ధాల్లో ఉండటంతో వారు మనకూ శత్రువులేనా అని పలువురు అనుకుంటారు. మనకు, వారికి ఇప్పటివరకు విభేదాలు/శత్రుత్వం రాలేదు. 1999లో పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు నేపాల్-ఢిల్లీ IC 814 విమానాన్ని హైజాక్ చేశారు. దాన్ని అఫ్గాన్‌లో ల్యాండ్ చేశారు. తాలిబన్లకు చెడ్డపేరు వచ్చేందుకు ఆ ప్లాన్ చేశారు. కానీ తాలిబన్లు ఆ విమానానికి రక్షణగా ఉండటంతో పాటు ఎవరికీ అపాయం కలగకుండా చూశారు.