News June 22, 2024
టెట్ మళ్లీ నిర్వహించాలని మంత్రి లోకేశ్కు వినతి

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)ను మళ్లీ నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్కు టీడీపీ ఎమ్మెల్సీలు శ్రీకాంత్, చిరంజీవి, రామ్గోపాల్ విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్కు సీఎం చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి టెట్ నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Similar News
News October 24, 2025
సూపర్ ఫిట్గా శర్వానంద్

టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త లుక్లో అదరగొడుతున్నారు. సన్నగా మారిపోయి, సడన్గా చూస్తే గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్ఫామ్ అయ్యారు. శర్వానంద్ ప్రస్తుతం ‘బైకర్’ అనే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీలో నటిస్తుండగా, సినిమాలో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఆయన సూపర్ ఫిట్గా మారిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శర్వానంద్ కొత్త లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News October 24, 2025
సమస్యలను దూరం చేసే వాస్తు దిక్కును ఎలా ఎంచుకోవాలి?

ఇల్లు కట్టుకునేటప్పుడు/కొనేటప్పుడు ఆ ఇంటి దిక్కు మనకు మంచి చేస్తుందా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. జన్మరాశి ఆధారంగా మన ఇంటికి ఏ దిక్కు అనుకూలమో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. ‘జన్మ రాశి, నక్షత్రం తెలియకపోయినా, పేరు బలాన్ని ఉపయోగించి ఏ దిక్కు శుభప్రదమో తెలుసుకోవచ్చు. వాస్తు విషయంలో దిక్కుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 24, 2025
న్యూస్ అప్డేట్స్

➤ J&Kలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రిలీజ్. 3 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, క్రాస్ ఓటింగ్తో ఒక స్థానంలో BJP గెలుపు
➤ బిహార్లో BJP-JDU కూటమి CM అభ్యర్థి నితీశ్ కుమార్ అని స్పష్టం చేసిన PM మోదీ.
➤ AP: తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
➤ TG: జూబ్లీహిల్స్ తుది ఓటర్ లిస్ట్ రిలీజ్. మొత్తం 4,01,365 మంది ఓటర్లు.


