News October 21, 2024
రెండున్నరేళ్ల క్రితం రీరిలీజ్.. వెయ్యి రోజులుగా స్క్రీనింగ్

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘విన్నైతాండి వరువాయా’ 2010లో రిలీజై గొప్ప విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తమిళ నటుడు శింబు, త్రిష కాంబోలో ఈ మూవీ తెరకెక్కగా దీనిని తెలుగులో ‘ఏమాయ చేశావే’గా రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని రెండున్నరేళ్ల క్రితం రీరిలీజ్ చేయగా చెన్నైలోని అన్నానగర్ PVR థియేటర్లో స్క్రీనింగ్ అవుతోంది. నేటికి వెయ్యి రోజులు పూర్తవడంతో సినీ అభిమానులు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.
Similar News
News January 18, 2026
నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కు అప్లై చేశారా?

<
News January 18, 2026
కారణజన్ముడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు

AP: NTR కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి అని CM CBN అన్నారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘‘సిని వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ NTR తరతరాల చరిత్రను తిరగరాశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు. రూ.2కే కిలో బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు తదితర పథకాలతో చరిత్ర గతిని మార్చారు’’ అని కొనియాడారు.
News January 18, 2026
X యూజర్లకు మస్క్ ₹9 కోట్ల ఆఫర్!

ఎలాన్ మస్క్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. ‘X’లో అత్యుత్తమంగా నిలిచే ఒక లాంగ్ ఫామ్ ఆర్టికల్కు ఏకంగా $1M (సుమారు ₹9 కోట్లు) బహుమతి ఇస్తామన్నారు. క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ కనీసం 1,000 పదాలు ఉండాలి. కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. AI వాడొద్దు. ప్రస్తుతానికి ఈ పోటీ జనవరి 28 వరకు అమెరికాలోని ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.


