News August 22, 2024
పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్

AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. అనంతరం బెయిల్ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రేపటికి రిజర్వ్ చేసింది. ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసులో నిందితుడైన ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారు.
Similar News
News July 11, 2025
రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.
News July 11, 2025
నాకు ప్రాణ హాని ఉంది: ట్రంప్

ట్రంప్పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి <<17014894>>జావద్ లారిజనీ<<>> చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘జావద్ లారిజనీ హెచ్చరికలను బెదిరింపులుగానే భావిస్తున్నాను. నా ప్రాణాలకు హాని ఉంది అనే వార్తల్లో సందేహం లేదు. నిజానికి నేను ఏడేళ్ల వయసు నుంచే సన్ బాత్ చేయడం మానేశాను’ అని వ్యాఖ్యానించారు. ఆ సమాధానం చూస్తే ఇరాన్ హెచ్చరికలను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
News July 11, 2025
శుభాంశు శుక్లా తిరుగు పయనం వాయిదా

ఇండియన్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు పయనం వాయిదా పడింది. <<16831702>>యాక్సియం-4<<>> మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన నలుగురు సభ్యులు ఈ నెల 14న భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. 14 రోజుల యాత్ర కోసం జూన్ 25న ఈ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఇవాళే వారు తిరిగి రావాల్సి ఉండగా వాయిదా పడింది. స్పష్టమైన కారణాలేంటో నాసా వెల్లడించలేదు.