News October 13, 2024
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా
శ్రేయస్ అనేక ప్రొడక్ట్ డిజైనర్ వర్క్ఫ్రం హోం కారణంగా ఓ సంస్థలో తక్కువ జీతానికి చేరారు. మొదటి రోజే 9 గంటలు కాకుండా 12-14 గంటలు పనిచేయాలని, అది కూడా కాంపెన్సేషన్ లేకుండా చేయాలని మేనేజర్ ఆదేశించారట. పైగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసికట్టుగా మాట్లాడడంతో శ్రేయస్ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది.
Similar News
News October 13, 2024
బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీగా జీతం
హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ (HURL)లో 212 డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: డిప్లొమా/బీఈ/బీటెక్. జీతం: రూ.23,000 నుంచి రూ.1,40,000. పూర్తి వివరాలకు <
News October 13, 2024
సూపర్ ఫాస్ట్ పెయిన్ సిగ్నల్స్ ఇవే..
మనిషి శరీరానికి దెబ్బలు తగలడం, గిచ్చడం, చెంప దెబ్బలు, కొరకడం ఇలా చాలా రకాలుగా నొప్పి కలుగుతుంది. అయితే అన్నింటికంటే జుట్టు లాగడంతో కలిగే నొప్పి అత్యంత వేగంగా వస్తుందని స్వీడన్ పరిశోధకులు తెలిపారు. ఈ నొప్పికి సంబంధించిన సందేశాలు 160 Km/H వేగంతో నరాల ద్వారా మెదడుకు చేరుతాయన్నారు. ఈ నొప్పికి PIEZO2 అనే ప్రొటీన్ కారణమని తెలిపారు. ఇది తక్కువగా ఉన్న వారు జుట్టు లాగడం ద్వారా వచ్చే పెయిన్ అనుభవించరు.
News October 13, 2024
మరణంలోనూ దాతృత్వం.. ఆస్పత్రికి సాయిబాబా డెడ్బాడీ
TG: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమకారుడు జీఎన్ <<14342758>>సాయిబాబా<<>> అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయిబాబా కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కు డొనేట్ చేస్తామని చెప్పారు. ఆయన భౌతికకాయానికి స్నేహితులు, బంధువులు నివాళులు అర్పించిన అనంతరం డెడ్బాడీని ఆస్పత్రికి అప్పగిస్తామన్నారు.