News April 5, 2025

నష్టం లేకుండా కంచ భూముల వివాదానికి పరిష్కారం: మీనాక్షి

image

TG: గచ్చిబౌలి కంచ భూముల అంశంపై కమిటీ వేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలతో కూడిన ఈ కమిటీ అందరి వాదనలు పూర్తిస్థాయిలో వింటుందని చెప్పారు. భూములపై ఏం చేయాలనేది తర్వాత నిర్ణయిస్తామని, ఎవరికీ నష్టం కలగకుండా వివాదం పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల లేఖలు, ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని ఆమె చెప్పారు.

Similar News

News February 6, 2026

శ్రీవారి నేత్ర దర్శనం ఏరోజు ఉంటుందంటే?

image

శ్రీ వేంకటేశ్వర స్వామి నేత్రాలు అత్యంత శక్తివంతమైనవి. అలాగే ప్రకాశవంతమైనవి కూడా! ఆ విశ్వశక్తిని సామాన్య మానవులు నేరుగా చూడలేరు. అందుకే స్వామివారి కళ్లను ఎప్పుడూ పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు. కేవలం గురువారం నాడు మాత్రమే ఆయన కళ్లను చూడవచ్చు. ఆనంద నిలయంలో ప్రతి గురువారం ‘నిజరూప దర్శనం’ సమయంలో మాత్రమే ఆ కర్పూర నామాన్ని తగ్గించి స్వామివారి నేత్రాలను చూసే అవకాశం కల్పిస్తారు.

News February 6, 2026

తొందరపడుతున్న బంగ్లాదేశ్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

image

భారత్-US ట్రేడ్‌ డీల్‌ తర్వాత బంగ్లాదేశ్‌ కూడా అగ్రరాజ్యంతో ‘సీక్రెట్’ ఒప్పందం కోసం తొందరపడుతోంది. ఈ నెల 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 9వ తేదీన హడావుడిగా ఒప్పందంపై సైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రేడ్ డీల్ అంటే పలుమార్లు చర్చిస్తారు. అందులోని విషయాలను ప్రజలు, పారిశ్రామికవేత్తలతో పంచుకుంటారు. ఇవేవీ లేకుండా రహస్యంగా డీల్‌కు రెడీ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News February 6, 2026

కుప్పకూలిన బిట్‌కాయిన్ ధర

image

క్రిప్టో కరెన్సీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గత OCTలో రికార్డు స్థాయిలో $1,26,272కు చేరిన బిట్‌కాయిన్ ధర $60,033కు పడిపోయింది. క్రిప్టో ఫ్రెండ్లీగా పేరున్న ట్రంప్ US అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పెరుగుదల కనిపించినా క్రమంగా తిరోగమనం మొదలైంది. రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను షేక్ చేస్తుండటంతో రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పతనం ప్రారంభమైంది.