News March 23, 2025
డీలిమిటేషన్పై రేపు అసెంబ్లీలో తీర్మానం

TG: నియోజకవర్గాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సీఎం రేవంత్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సభ్యుల ఆమోదం తర్వాత కేంద్రానికి పంపనున్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News March 25, 2025
ఉచిత ఇళ్లపై సీఎం కీలక ప్రకటన

AP: వచ్చే ఐదేళ్లలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ల సదస్సులో పునరుద్ఘాటించారు. ఇప్పటికే స్థలం పొందిన వారు కోరిన విధంగా ఇంటి పట్టాలు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 25, 2025
అనుష్క ‘ఘాటి’ మూవీ రిలీజ్ వాయిదా!

క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఘాటి’. ఈ సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీఎఫ్ఎక్స్ పనులే ఆలస్యానికి కారణమని వెల్లడించాయి. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉంది. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్లో అనుష్క లుక్ భయపెట్టేలా ఉంది.
News March 25, 2025
వివేకా హత్య కేసులో కీలక పరిణామం

AP: వివేకా హత్య కేసుపై SCలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. ‘MP అవినాశ్ చెప్పినట్లే సునీత, నర్రెడ్డిపై CBI అధికారి రాంసింగ్ కేసు నమోదు చేశారు. సునీత, నర్రెడ్డి, రాంసింగ్పై వివేకా PA కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును IO రాజు విచారించలేదు. తనను అవినాశ్ బెదిరించారని రాజు అంగీకరించారు. రిటైర్డ్ ASP రాజేశ్వరరెడ్డి, ASIG రామకృష్ణారెడ్డి కేసు మొత్తాన్ని నడిపించారు’ అని పేర్కొన్నట్లు సమాచారం.