News June 25, 2024
కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని తీర్మానం

కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం పినరయి విజయన్ నిన్న సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించాయి. విపక్షాలు పలు సవరణలు సూచించాయి. కాగా గత ఏడాది కూడా కేరళ ప్రభుత్వం దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. కానీ ఆ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
Similar News
News April 6, 2026
భర్తతో వీడియో కాల్.. తమిళ నటి ఆత్మహత్య

తమిళ నటి సుభాషిణి(36) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అపార్ట్మెంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉంటున్న భర్తతో వీడియో కాల్లో వాగ్వాదం జరిగి క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. అపార్ట్మెంట్ సెక్యూరిటీని భర్త అలర్ట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. తమిళంలో ‘కాయల్’ సహా పలు సీరియళ్లలో ఆమె నటించారు.
News April 6, 2026
ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. నెట్టింట విమర్శలు

నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘స్థాపనా దివస్ సందర్భంగా.. హిందూ ధర్మం ముసుగులో ద్వేషాన్ని పెంచుతూ దేశ ఆర్థిక వ్యవస్థను, సామరస్యాన్ని దెబ్బతీసిన ఫేక్ ఫకీర్’ గుర్తుకు వచ్చారు’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తన శిష్యులకు విద్వేషాన్ని నూరి పోస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఊహించాలంటూ నెటిజన్లను కోరారు. PM మోదీని లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
News April 6, 2026
తాత్కాలిక సీజ్ఫైర్ కోసం హార్ముజ్ని తెరిచేది లేదు: ఇరాన్

ఓవైపు అమెరికాతో థర్డ్ పార్టీ ద్వారా సంధి ప్రయత్నాలు జరుగుతున్నా హార్ముజ్ రీఓపెనింగ్పై ఇరాన్ పట్టువీడట్లేదు. తాత్కాలిక సీజ్ఫైర్ కోసం హార్ముజ్ని తెరిచేది లేదని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ఒత్తిళ్లకు, డెడ్లైన్లకు లొంగి తాము నిర్ణయాలు తీసుకోబోమని తెలిపింది. కాగా అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పెట్టిన <<19580239>>ప్రపోజల్స్లో<<>> ఈ హార్ముజ్ రీఓపెనింగ్ కూడా ఉన్నట్లు సమాచారం.


