News March 20, 2025

బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలంటూ శాసనసభలో తీర్మానం చేసింది. దీనికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది.

Similar News

News March 21, 2025

బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారంపై స్పందించిన ఫిల్మ్‌ ఛాంబర్

image

బెట్టింగ్ యాప్స్‌ల వల్ల యువత బలి అవుతుంటే సెలబ్రిటీలు వాటికి ప్రచారం చేయటం తప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులపై చర్యలు తీసుకునేలా MAA అసోసియేషన్‌కు లేఖ రాస్తామని పేర్కొంది. యువత చెడిపోయే వ్యవహారాలలో సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో భాగం కాకుడదని అభిప్రాయపడింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నట్లు పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News March 21, 2025

నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల

image

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. CPS, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని CM అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరింది.

News March 21, 2025

కష్ట సమయాల్లో అండగా కోహ్లీ: సిరాజ్

image

ఆర్సీబీని వీడటం బాధగా ఉందని పేస్ బౌలర్ సిరాజ్ అన్నారు. తన కెరీర్‌లో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. 2018-19లో క్లిష్ట పరిస్థితుల్లోనూ తన వెన్నంటి ఉన్నారన్నారు. ఆ తర్వాత తాను తిరిగి సత్తా చాటినట్లు తెలిపారు. గత ఏడాది వేలంలో సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఆర్సీబీ తరఫున 87 మ్యాచుల్లో 83 వికెట్లు తీశారు. ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ సిరాజ్.

error: Content is protected !!