News October 22, 2024

ఎన్ఐసీకి ధరణి బాధ్యతలు

image

TG: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు పర్యవేక్షించిన గ్రూప్ క్వాంటెలాను ప్రభుత్వం పక్కన పెట్టింది. తక్కువ వ్యయంతో నిర్వహణకు ముందుకు రావడంతో ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. NIC మూడేళ్ల పాటు నిర్వహణ చూడనుంది.

Similar News

News January 20, 2026

రాష్ట్రంలో పశువులకు బీమా పథకం ప్రారంభం

image

AP: పశువుల అకాల మరణంతో రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం పశు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ప్రీమియం మొత్తంలో ప్రభుత్వం 85% భరించనుండగా రైతు 15% చెల్లించాలి. మేలు జాతి పశువులకు ₹30,000, నాటు పశువులకు ₹15,000 వరకు కవరేజీ ఉంటుంది. ఈ నెల 31 వరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో రైతులు నమోదు చేసుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

News January 20, 2026

అమ్మాయిలూ ఇలా చేస్తున్నారా?

image

చాలామంది మహిళలు తమది సున్నిత మనస్తత్వం అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశముందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మహిళలు వాస్తవిక ధోరణితో ఆలోచించాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా చూసుకోవాలి. భావోద్వేగాల పరంగా ఇతరులపై ఆధారపడే గుణాన్ని తగ్గించుకోవాలి. అవసరమైతే నిపుణులతో కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. ఆకతాయిల నుంచి ఎలాంటి వేధింపులు ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలి.

News January 20, 2026

సంక్రాంతికి ప్రైవేటు దందా.. 1,896 బస్సులపై కేసులు

image

AP: నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,896 బస్సులపై కేసులు నమోదు చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు 548, పన్ను ఎగవేత, పర్మిట్, ఫిట్‌నెస్ లేకపోవడం వంటి ఉల్లంఘనలపై 1,348 కేసులు పెట్టారు. ఆయా ట్రావెల్స్‌పై మొత్తంగా రూ.1.27 కోట్ల జరిమానాలు విధించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9 నుంచి 18 వరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.