News March 19, 2024

ఝార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ బాధ్యతలు

image

తెలంగాణ గవర్నర్ బాధ్యతల్ని రాష్ట్రపతి ఎవరికి అప్పగిస్తారన్న ఉత్సుకతకు తెరపడింది. ఏపీ గవర్నర్ నజీర్‌కే తోటి తెలుగు రాష్ట్రం బాధ్యతల్ని ఇస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌‌ను తాత్కాలికంగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News April 11, 2025

పట్టుకున్న చేప ప్రాణం తీసింది!

image

చెన్నైలో చేపలు పడుతున్న ఓ వ్యక్తి, చేప వల్లే చనిపోయాడు. మణికందన్ అనే వ్యక్తి కీలావలంలోని చేపల చెరువులో రెండు చేపల్ని పట్టుకున్నారు. ఒకదాన్ని చేతితో, మరోదాన్ని నోటితో పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వస్తుండగా నోటితో పట్టుకున్న చేప ఆయన గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడే అది ఇరుక్కుపోవడంతో మణికందన్ విలవిల్లాడారు. స్థానికులు సాయం చేసేలోపే ప్రాణాలు విడిచారు.

News April 11, 2025

చైనా ప్రతిపాదన… ఆస్ట్రేలియా తిరస్కరణ

image

అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో వేరే దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆస్ట్రేలియాను తమకు కలిసిరావాలని కోరగా బీజింగ్‌కు చుక్కెదురైంది. అమెరికా సుంకాలపై ఉమ్మడిగా పోరాడదామంటూ చైనా ఇచ్చిన పిలుపును ఆస్ట్రేలియా తిరస్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చైనా చేతిని పట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తామని పేర్కొంది.

News April 11, 2025

14,956 ఎకరాల్లో పంట నష్టం!

image

TG: అకాల వర్షాల కారణంగా 14,956 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. వాటిలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటలున్నాయని పేర్కొంది. ఒక్క గత నెలలో వానలకే 8408 ఎకరాల పంట నేలవాలిందని పేర్కొంది. ఈ నెల 3 నుంచి 9 వరకు 7 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వానలు చేకూర్చిన నష్టంపై రూపొందించిన నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.

error: Content is protected !!