News March 21, 2024
48 గంటల్లో ‘సెట్టాప్’ సేవల పునరుద్ధరణ: APSFL

AP: రాష్ట్రంలోని అన్ని సెట్టాప్ బాక్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు APSFL వెల్లడించింది. ఎన్నికల కోడ్కు అనుగుణంగా డేటాను మార్చుతున్నామని, 48 గంటల్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం సెట్టాప్లలో ప్రసారం కావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 23, 2025
TDP-JSP అబద్ధాలు బయట పడ్డాయి: జగన్

AP: వైసీపీ హయాంలో AP బ్రాండ్ దెబ్బతిందంటూ TDP, JSP చెప్పింది అబద్ధమని తేలినట్లు Ex.CM జగన్ పేర్కొన్నారు. ‘AP బ్రాండ్, పెట్టుబడులు దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు. కానీ RBI డేటా ప్రకారం 2019-24 మధ్య మాన్యుఫాక్చరింగ్లో సౌత్లో AP ఫస్ట్, దేశవ్యాప్తంగా ఐదోస్థానంలో ఉంది. ఇండస్ట్రీ సెక్టార్లో సౌత్లో ఫస్ట్, దేశంలో 8వ స్థానంలో నిలిచింది. దీనిని బ్రాండ్ దెబ్బతినడం అంటారా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
News December 23, 2025
రికార్డుల రేసులో బంగారం, వెండి ధరలు..!

అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఇవాళ తొలిసారిగా ఔన్స్ $70 మార్కు తాకింది. అటు బంగారం ధర కూడా ఔన్స్కు $4,484 ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరింది. సామాన్యులకు భారంగా మారుతున్నా, ఇన్వెస్టర్లకు మాత్రం పసిడి లాభాల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఓవరాల్గా 2025లో గోల్డ్ ₹60,550 (జనవరిలో 10గ్రా సగటున ₹78K ఉంటే నేడు ₹1,38,000) కేజీ వెండి ₹1.36లక్షలు పెరిగింది (JANలో ₹90K, ఇవాళ ₹2,34,000).
News December 23, 2025
DANGER: చలికాలమే అని నీళ్లు తాగట్లేదా?

చలికాలంలో బాడీకి నీళ్ల అవసరం లేదని చాలామంది పొరబడుతుంటారు. కానీ శ్వాస, యూరిన్ ద్వారా బాడీలోని వాటర్ బయటకు పోతుంది. రక్తం చిక్కగా మారి గుండె మీద ప్రెజర్ పడుతుంది. BP పెరుగుతుంది. కిడ్నీలు మలినాలను క్లీన్ చేయలేవు. స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. స్కిన్ డ్రై అవ్వడం, పెదవులు పగలడం, మలబద్ధకం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వింటర్లోనూ 2-3 లీటర్ల నీళ్లు తాగాలనేది డాక్టర్ల సూచన.


