News May 12, 2024
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సంబంధాల పునరుద్ధరణ: జైశంకర్

చైనా సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు వివాదాలపై సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం ఉంటేనే ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణ సాధ్యమవుతుందన్నారు. బోర్డర్లో ఘర్షణ వాతావరణం ఉన్నా చైనాతో వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘2014కు ముందు తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
ధనుర్మాసం: ఐదోరోజు కీర్తన

మధురా నగరంలో, యమునా తీరంలో జన్మించిన కృష్ణుడు అద్భుత గుణాలు కలవాడు. గొల్ల కులాన్ని తన రాకతో ప్రకాశింపజేశాడు. యశోద గర్భానికి వెలుగునిచ్చిన ఆయనను మనం పవిత్రమైన మనసుతో శరణు వేడాలి. ఏ కోరికలు కోరక స్వామిని భక్తితో పూజించాలి. ఆయన కల్యాణ గుణాలను గానం చేయాలి. ఫలితంగా మన పాపాలు పోతాయి. రాబోవు దోషాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మమవుతాయి. సర్వపాప హరుడైన ఆ పరమాత్మ నామస్మరణను ఎప్పుడూ మరువకూడదు. <<-se>>#DHANURMASAM<<>>
News December 20, 2025
జోనర్లు మార్చుకుంటున్న రవితేజ

గతంలో వరుసగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ప్రస్తుతం తన పంథా మార్చారు. ఇటీవల ఒక్కో సినిమాకు ఒక్కో జోనర్ సెలక్ట్ చేసుకొని అలరిస్తున్నారు. ధమాకాతో మాస్, రావణాసురతో థ్రిల్లర్కు ఓటేసిన ఆయన టైగర్ నాగేశ్వరరావుతో పీరియాడిక్ డ్రామా ఎంచుకున్నారు. త్వరలో అనుదీప్తో కామెడీకి సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో వస్తున్నారు. ఈ మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.
News December 20, 2025
ఈ నెల 24న కొడంగల్కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వారిలో ముఖాముఖితో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.


