News May 12, 2024

సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సంబంధాల పునరుద్ధరణ: జైశంకర్

image

చైనా సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు వివాదాలపై సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం ఉంటేనే ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణ సాధ్యమవుతుందన్నారు. బోర్డర్‌లో ఘర్షణ వాతావరణం ఉన్నా చైనాతో వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘2014కు ముందు తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 3, 2026

కొడుకు, కోడలు క్యూట్ ఫొటో షేర్ చేసిన ప్రియాంకా గాంధీ

image

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ త్వరలో <<18710916>>పెళ్లి<<>> చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు, కాబోయే కోడలు క్యూట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. వారిద్దరూ మూడేళ్ల వయసు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నా. ఎల్లప్పుడూ ఒకరినొకరూ ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మూడేళ్ల వయసు నుంచీ ఉన్నట్లే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగండి ’ అని రాసుకొచ్చారు.

News January 3, 2026

గ్రూపులు బువ్వ పెట్టవు.. కొత్త నేతలను గద్దల్లా పొడవొద్దు: ఈటల

image

TG: పార్టీలో చేరిన నేతలను గౌరవించి అక్కున చేర్చుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అంతేతప్ప కాకులు, గద్దల్లా పొడవొద్దని అన్నారు. ‘గ్రూపులు మంచివి కావు. అవి బువ్వ పెట్టవు. మనకు ఉన్న శక్తే తక్కువ. మళ్లీ ఇందులో గ్రూపులు అవసరమా? రాజకీయాల్లో విశాల హృదయంతో ఆలోచించాలి. శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు’ అని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

News January 3, 2026

జనవరి 3: చరిత్రలో ఈరోజు

image

1831: సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జననం
1925: నటుడు రాజనాల కాళేశ్వరరావు జననం
1934: రచయిత వీటూరి సత్య సూర్యనారాయణ మూర్తి జననం
1940: తెలుగు సినీ దర్శకుడు కట్టా సుబ్బారావు జననం
2002: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ మరణం
*జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం