News May 12, 2024

సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సంబంధాల పునరుద్ధరణ: జైశంకర్

image

చైనా సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు వివాదాలపై సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం ఉంటేనే ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణ సాధ్యమవుతుందన్నారు. బోర్డర్‌లో ఘర్షణ వాతావరణం ఉన్నా చైనాతో వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘2014కు ముందు తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

స్టూడెంట్స్‌ సంఖ్య ఆధారంగానే ‘కుక్’లు

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వంట మనుషుల సంఖ్య ఉండాలని DEOలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో 25 మంది స్టూడెంట్స్ ఉంటే కుక్ కమ్ హెల్పర్‌ను, 26-100 మధ్య ఉంటే ఇద్దరు హెల్పర్లు, 101-200 మధ్య ఉంటే ముగ్గురు హెల్పర్లను తీసుకోవాలన్నారు. ఆపై ప్రతి 100 మందికి ఒక అదనపు హెల్పర్‌ను నియమించుకోవచ్చన్నారు. సంబంధిత బిల్లులు ఆన్‌లైన్ ద్వారా క్లైయిమ్ చేయాలని తెలిపారు.

News December 15, 2025

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్‌కు పంపుతారు. అయితే రేషన్‌కార్డుదారులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సచివాలయాల్లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ATM తరహాలోని ఈ కార్డులపై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబం పూర్తి వివరాలు తెలుస్తాయి.

News December 15, 2025

నేడు ప్రధానితో మెస్సీ భేటీ

image

గోట్ టూర్‌లో భాగంగా నేటితో మెస్సీ భారత పర్యటన ముగియనుంది. ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఓ హోటల్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని PM మోదీతో భేటీ అవుతారు. అనంతరం జాతీయ ఫుట్‌బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసంలో CJI జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరులను కలవనున్నారు. 3.30pmకి ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి వెళ్లి సినీ, క్రీడా ప్రముఖులతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతారు.