News May 12, 2024
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సంబంధాల పునరుద్ధరణ: జైశంకర్

చైనా సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు వివాదాలపై సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం ఉంటేనే ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణ సాధ్యమవుతుందన్నారు. బోర్డర్లో ఘర్షణ వాతావరణం ఉన్నా చైనాతో వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘2014కు ముందు తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
హనుమాన్ చాలీసా భావం – 38

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ దివ్యమైన హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుంచి, కట్టివేసే బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారికి శారీరక, మానసిక సమస్యలు, లోక కట్టుబాట్లన్నీ తొలగిపోతాయి. సంతోషం, శాంతి లభిస్తాయి. హనుమంతుడి కృపతో వారు నిరంతర ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 14, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భారీ జీతంతో ఉద్యోగాలు

<
News December 14, 2025
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.


