News April 2, 2025
మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై ఆంక్షలు

TG: మూసీ నది పరిసరాల్లో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూసీకి 50మీటర్ల వరకు బఫర్జోన్లో నిర్మాణాలు చేపట్టవద్దని, 50-100 మీటర్ల వరకు కొత్త అనుమతులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికరహిత అభివృద్ధి జరగకుండా DTCP, GHMC చీఫ్ ప్లానర్, HMDA ప్లానింగ్ డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేఎండీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
Similar News
News December 27, 2025
అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే?

క్రికెట్లో భారత్ అనగానే ఒంటికాలి మీద వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. మన పిచ్ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని నోటికొచ్చిన మాటలన్నారు. అలాంటి వాళ్లు AUS పిచ్లపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుత యాషెస్ సిరీస్లో NOV 21న పెర్త్లో తొలి టెస్ట్, ఇవాళ మెల్బోర్న్లో 4వ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. మన పిచ్లను క్రికెట్కు ప్రమాదంగా అభివర్ణించినవాళ్లు ఇప్పుడు మూగబోవడం వింతగా ఉంది.
News December 27, 2025
ప్రాజెక్టులపై అసెంబ్లీలో PPT ప్రజెంటేషన్!

TG: ఈనెల 29 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. PPT ప్రజెంటేషన్ ద్వారా దీటుగా జవాబిచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అదే తరహాలో తానూ PPTతో ప్రశ్నించడానికి BRS నేత హరీశ్ రెడీ అవుతున్నారు. ఒకవేళ తనను అందుకు అనుమతించకపోతే సభ వెలుపల PPT ప్రదర్శించాలని యోచిస్తున్నారు.
News December 27, 2025
చలి ఎక్కువగా అనిపిస్తోందా? ఇవి కూడా కారణం కావొచ్చు

కొందరికి చలి ఎక్కువగా అనిపించడం అనేది శరీరంలోని వివిధ సమస్యలను సూచిస్తుందంటున్నారు నిపుణులు. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయనప్పుడు చలి ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేని వారు ఈ కోవకు చెందుతారు. అలాగే విటమిన్ B12, విటమిన్ D లోపం ఉన్నవారిలో కూడా చలి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీరు పాలకూర, బీట్రూట్, గుడ్లు, చేపలు, చికెన్ పాలు, పెరుగు తినాలని సూచిస్తున్నారు.


