News December 16, 2024
అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు

TG: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజా ప్రతినిధులకు అనుమతిని నిషేధించారు. ఈ మేరకు అసెంబ్లీలో నో ఎంట్రీ బోర్డులు దర్శనమిచ్చాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి వీడియోలు తీయొద్దని మీడియాను కూడా ఆదేశించారు. దీనిపై మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 1, 2025
పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? థైరాయిడ్ కావొచ్చు

ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. పిల్లల్లో ఈ సమస్యను నివారించాలంటే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పిల్లలు అలసిపోయినట్లు అనిపించడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, చర్మం, పొడిగా, నిర్జీవంగా మారడం, మలబద్ధకం, అజీర్ణం, థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం, కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
News November 1, 2025
కేశినేని చిన్ని VS కొలికపూడి.. చంద్రబాబు ఆగ్రహం

AP: MP కేశినేని చిన్ని, MLA కొలికపూడి మధ్య <<18088401>>విభేదాలపై<<>> CM CBN మండిపడ్డారు. వారి నుంచి వివరణ తీసుకుని తనకు నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ‘పార్టీ నేతలు ఇలా ఆరోపణలు చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ సిద్ధాంతాల గురించి తెలియని వారికి, పొలిటికల్ అనుభవం లేని వారికి టికెట్లిచ్చి తొందరపడ్డానేమో’ అని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు.
News November 1, 2025
APPLY NOW: ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీ 116 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, బీఈ, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీసీఏ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. www.apprenticeshipindia.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: https://mumbaiport.gov.in/


