News January 9, 2025
Results Season: నష్టాలు తెచ్చాయి..!

స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. కార్పొరేట్ సంస్థలు Q3 ఫలితాలు ప్రకటించే సీజన్ ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోంది. సెన్సెక్స్ 442 పాయింట్లు నష్టపోయి 77,681 వద్ద, నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 23,526 వద్ద స్థిరపడ్డాయి. India Vix 14.69గా ఉంది. రియల్టీ, IT, మెటల్, PSU బ్యాంక్స్, ఫైనాన్స్ రంగాలు నష్టపోయాయి. BAJAJ Auto టాప్ గెయినర్.
Similar News
News December 3, 2025
గొల్లపల్లి: ‘నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలి’

నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్, తిరుమలాపూర్, పెగడపల్లి మండలం నంచర్లలో మూడో విడత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన నామినేషన్ల కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను ఈసీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ కలెక్టర్ హరిణి ఉన్నారు.
News December 3, 2025
ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే ఏంటి?

తిరుమలలో ఏడాదికి ఓసారి ‘సాలకట్ల బ్రహ్మోత్సవాలు’ నిర్వహిస్తారు. అయితే, ఈ ఉత్సవ వైభవాన్ని భక్తులు రోజూ దర్శించుకునేందుకు వీలుగా TTD ఈ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దీనిని వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తారు. ఈ సేవలో భాగంగా స్వామివారికి రోజూ శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహన సేవలను జరుపుతారు. ఇది భక్తులకు నిత్యం స్వామివారి ఉత్సవ శోభను చూసే అవకాశం కల్పిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 3, 2025
ENCOUNTER.. ఐదుగురు మావోలు మృతి

ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మరణించారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


