News April 25, 2024

ఏ క్షణమైనా ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్-2 ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న ఫలితాలు వెల్లడికావాల్సి ఉండగా.. ఇవాళే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయగా.. ఫలితాలు ప్రకటించేందుకు NTA కసరత్తు చేస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

Similar News

News December 8, 2025

ఈ హాస్పిటల్‌లో అన్నీ ఉచితమే..!

image

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్‌ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

News December 8, 2025

సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్‌(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 8, 2025

మూవీ ముచ్చట్లు

image

✦ ఈ నెల 12నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’