News April 10, 2025

ఈ నెల 17న ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కానున్నాయి. నిన్నటితో బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షలు ముగిశాయి. తొలి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, 17న రెండో సెషన్ రిజల్ట్స్ రానున్నాయి. ఈ నెల 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. మే 18న ఈ పరీక్ష జరగనుంది.

Similar News

News November 25, 2025

నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

image

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.

News November 25, 2025

GAIL (INDIA) లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>GAIL<<>>(INDIA)లిమిటెడ్‌ 29 బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE, B.Tech, ME, M.Tech, MCA, MBA, CA, CMA, B.Com, BA, BSc, MBBS, DGO, DCH ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, PWBDలకు ఫీజు లేదు. https://www.gailonline.com

News November 25, 2025

నేడు మరో అల్పపీడనం.. 5 రోజులు వర్షాలు!

image

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని APSDMA తెలిపింది. మరో 48hrsలో తుఫానుగా మారనుందని పేర్కొంది. అటు ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఇవాళ్టి నుంచి 28 వరకు ద.కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 29, 30 తేదీల్లో ద.కోస్తా. రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ, ఉ.కోస్తాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.