News April 10, 2025
ఈ నెల 17న ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కానున్నాయి. నిన్నటితో బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షలు ముగిశాయి. తొలి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, 17న రెండో సెషన్ రిజల్ట్స్ రానున్నాయి. ఈ నెల 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. మే 18న ఈ పరీక్ష జరగనుంది.
Similar News
News October 24, 2025
భారత తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్

అనేక పురుషాధిక్య రంగాల్లో ప్రస్తుతం మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. కానీ 1965లో ఒక మహిళ యుద్ధక్షేత్రంలోకి దిగి ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని రిపోర్ట్ చేసిందంటే నమ్మగలరా.. ఆమే భారతదేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్. ఆమె ఏం చేసినా సెన్సేషనే. ఎన్నో స్కాములను ఆమె బయటపెట్టారు. ఎన్నో బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదు. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది.
News October 24, 2025
లిక్కర్ స్కామ్ కేసు.. రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 7 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా ఐదుగురు బెయిల్పై విడుదలయ్యారు. ఏడుగురు నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
News October 24, 2025
శివ పూజలో ఈ పత్రాలను వాడుతున్నారా?

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలను శివ పూజలో వినియోగించడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. త్రిదళాలుగా పిలిచే ఈ ఆకులు శివుడి త్రిగుణాతీత స్వరూపానికి, 33 కోట్ల దేవతలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శివాలయాలలో నిత్యం బిల్వార్చనలు చేస్తారు. పురాణాల ప్రకారం.. కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించడం ఎంతో పుణ్యం పుణ్యమట. ఫలితంగా అద్భుతమైన శుభ ఫలితాలను ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.


