News April 15, 2025

ఆరేళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

image

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. మార్చిలో 3.34% నమోదైంది. 2019 AUG తర్వాత ఇదే అత్యల్పం. FEBలో 3.61% నమోదైన విషయం తెలిసిందే. వరుసగా 2 నెలలు RBI టార్గెట్ 4% కన్నా తక్కువగా నమోదవడం విశేషం. నిత్యావసర ధరలు తగ్గడంతో ఆహార ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వచ్చింది. FEBలో 3.75% ఉండగా MARలో 2.69%కు తగ్గింది. 2021 నవంబర్ తర్వాత ఇదే కనిష్ఠం. ఈ తగ్గుదల గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది.

Similar News

News April 18, 2025

రాష్ట్రానికి రూ.28,842 కోట్ల మద్యం ఆదాయం

image

AP: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ రూ.28,842 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు, వైన్స్, బార్లు, డిస్టిలరీల లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.2,206 కోట్లు, దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు వచ్చినట్లు వివరించింది. ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.

News April 18, 2025

స్టేషన్ల సుందరీకరణ కాదు.. రైళ్లను పెంచండి: నెటిజన్లు

image

అమృత్‌ భారత్ స్కీమ్ కింద కేంద్రం రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. TGలోని సికింద్రాబాద్, బేగంపేట, వరంగల్ తదితర రైల్వే స్టేషన్లను సుందరీకరిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ట్రాక్స్‌ను పునరుద్ధరించడం, మరిన్ని రైళ్లను పెంచడానికి బదులుగా స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. సీట్ల లభ్యత, ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News April 18, 2025

చైనాతో మంచి డీల్ చేసుకుంటాం: ట్రంప్

image

వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే యూరప్‌తోపాటు ఇతర దేశాలతో డీల్ చేసుకోవడంలో కొంత సమస్య ఉందన్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి వైట్ హౌస్ పర్యటన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. కాగా అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై US ఏకంగా 245శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!