News December 24, 2024
మున్నేరుకు రిటైనింగ్ వాల్: మంత్రి పొంగులేటి

TG: మున్నేరు వరద ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘రిటైనింగ్ వాల్కు భూసేకరణ చేపడతాం. ఖమ్మంలో మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తాం. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో 23 కి.మీ మేర గోడ ఏర్పాటు చేస్తాం’ అని ఆయన వివరించారు.
Similar News
News December 1, 2025
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.
News December 1, 2025
ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>
News December 1, 2025
ఉద్యోగుల బేసిక్ PAYలో 50% DA మెర్జ్? కేంద్రం సమాధానమిదే

ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో DA నుంచి కొంత మొత్తాన్ని మెర్జ్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. 50% DAను వెంటనే బేసిక్ పేలో కలపాలని ఇటీవల ఉద్యోగ సంఘాలు లేఖ రాసిన నేపథ్యంలో లోక్సభలో సమాధానమిచ్చింది. కాగా ఒకవేళ బేసిక్ PAYలో 50% డీఏ కలిస్తే ఎంట్రీ లెవల్ బేసిక్ పే ₹18వేల నుంచి ₹27వేలకి పెరగనుంది. అటు 8th పే కమిషన్ 2027లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు.


