News November 27, 2024

ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతిపై పునరాలోచిస్తాం: ప్రభుత్వం

image

TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం పరిశ్రమకు ఇచ్చిన అనుమతిపై పునరాలోచన చేస్తామని తెలిపింది. అవసరమైతే పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని సర్కార్ యోచిస్తోంది. కాగా, ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ మూడు, నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు.

Similar News

News October 25, 2025

అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

image

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.

News October 25, 2025

మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

News October 25, 2025

US ఆఫీసర్ హత్య.. మోదీని టార్గెట్ చేసినందుకేనా?

image

US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్‌లో హత్యకు గురవడం అనుమానాలకు దారితీసింది. PM మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్‌ను హతమార్చిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్‌ కార్లో రహస్యంగా చర్చించారని పేర్కొన్నాయి. దేశ ప్రజలకు నిజమేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత సింఘ్వీ తాజాగా డిమాండ్ చేశారు.