News July 14, 2024

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులూ పింఛన్ తీసుకున్నారు!

image

TG: ‘ఆసరా’ పక్కదారి పట్టడంపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగపరంగా పింఛన్ పొందుతున్న 5,650 మంది విశ్రాంత ఉద్యోగులు కూడా పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. వీరిలో 3,824 మంది మరణించగా మిగిలిన 1826 మంది ఇప్పటికీ రెండూ తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి 2 పింఛన్లు తీసుకోకూడదు. దీంతో ప్రభుత్వం వారి నుంచి పెన్షన్ రికవరీ చేస్తోంది.

Similar News

News November 28, 2025

వాషింగ్ మెషీన్.. ఈ జాగ్రత్తలు తెలుసా?

image

నిన్న HYDలో వాషింగ్ మెషీన్ <<18404735>>పేలడంతో<<>> చాలా మంది భయపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. *రెగ్యులర్‌గా ఫిల్టర్ క్లీన్ చేసుకోవడంతో పాటు సర్వీసింగ్ చేయించాలి *టూల్స్ మార్చాల్సి వస్తే బ్రాండెడ్‌వే వాడాలి *ఎక్కువ లోడ్ (దుస్తులు) వేయొద్దు. దీన్ని వల్ల ఒత్తిడి పెరుగుతుంది *ఏదైనా పెద్ద శబ్దం, వాసన వస్తే వెంటనే ప్లగ్ తీసి టెక్నీషియన్‌ను పిలవాలి.

News November 28, 2025

మంచాన్ని గోడలకు ఆనించవచ్చా?

image

మంచాన్ని గోడకు ఓవైపు మాత్రమే ఆనించి ఉంచాలని, అదే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. మిగిలిన 3 వైపులా వీలైనంత ఖాళీ స్థలం ఉండాలంటున్నారు. ‘మంచంపై నుంచి వ్యక్తులు సులభంగా దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండాలి. గదిలో ఇరుకు ఉండకుండా, ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా స్పేస్ ఉండాలి. దీనివల్ల శక్తి ప్రవాహం పెరుగుతుంది. 3 వైపులా గోడలు ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 28, 2025

వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

image

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT