News July 14, 2024
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులూ పింఛన్ తీసుకున్నారు!

TG: ‘ఆసరా’ పక్కదారి పట్టడంపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగపరంగా పింఛన్ పొందుతున్న 5,650 మంది విశ్రాంత ఉద్యోగులు కూడా పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. వీరిలో 3,824 మంది మరణించగా మిగిలిన 1826 మంది ఇప్పటికీ రెండూ తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి 2 పింఛన్లు తీసుకోకూడదు. దీంతో ప్రభుత్వం వారి నుంచి పెన్షన్ రికవరీ చేస్తోంది.
Similar News
News December 1, 2025
గూడూరులో దారుణం

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
News December 1, 2025
భారీ జీతంతో ECGC లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECGC)లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, MA(హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. DEC 15నుంచి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. JAN 11న రాత పరీక్ష, FEB/MARలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.88,635 -రూ.1,69,025 చెల్లిస్తారు.
News December 1, 2025
భక్తికి, నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’

నిర్గుణోపాసన, నిరంతర నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’. ఈ పవిత్ర స్థలంలోనే శబరి మాత కఠోర భక్తితో అయ్యప్ప స్వామి దర్శనం పొందింది. ఈ పీఠానికి దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. పూర్వకాలంలో, పందళ రాజవంశీయులు ఇక్కడ ఓ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి విద్యనభ్యసించారని ప్రతీతి. భక్తికి, నిరీక్షణకు గొప్ప ఉదాహరణగా నిలిచే ఈ ప్రదేశం అయ్యప్ప స్వాములకు పరమాత్మ దర్శనానికి మార్గాన్ని చూపిస్తుంది. <<-se>>#AyyappaMala<<>>


