News October 22, 2024

బెంగాల్‌లో దీక్ష విరమించిన జూనియర్ డాక్టర్లు

image

బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష ముగిసింది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన తమ సహచరురాలికి న్యాయం చేయాలంటూ 16 రోజులుగా వారు దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలతో సీఎం మమతా బెనర్జీ చర్చలు జరిపారు. వైద్యులపై దాడి, వైద్యులకు రక్షణ, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వంటి అంశాలపై మమతా వారికి హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలను జూడాలు విరమించారు.

Similar News

News October 22, 2024

12 మంది హెడ్ మాస్టర్ల సస్పెండ్

image

TG: రాష్ట్రంలో 12 మంది హెడ్ మాస్టర్‌లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్‌ఫర్స్‌లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. మహబూబ్ నగర్(D)లో 10 మంది, వనపర్తి, జనగామ(D)ల్లో ఒక్కో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

News October 22, 2024

టెట్ పరీక్షకు 86 శాతం మంది హాజరు

image

AP: రాష్ట్రంలో 17 రోజులుగా కొనసాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారంతో ముగిసింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661(86.38శాతం) మంది పరీక్షలు రాశారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ ఈ నెల 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

News October 22, 2024

టీడీఆర్ బాండ్ల ఆన్‌లైన్ పోర్టల్ పున:ప్రారంభం

image

AP: టీడీఆర్ బాండ్ల వినియోగానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం పున:ప్రారంభించింది. ఇకపై ఆన్‌లైన్‌ దరఖాస్తులను అధికారులు పరిశీలనకు తీసుకోనున్నారు. అపార్ట్‌మెంట్లలో అదనపు ఫ్లోర్లు వేసుకోవడానికి ఉద్దేశించిన ఈ బాండ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. సర్వే నంబర్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని మార్కెట్ విలువ ఆధారంగా కొత్త TDR బాండ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.