News July 3, 2024
రేవంత్, చంద్రబాబు గురుశిష్యులు కాదు: భట్టి
TG: సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు గురుశిష్యులు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వారిద్దరూ సహచరులు మాత్రమేనని మీడియాతో చిట్చాట్ సందర్భంగా పేర్కొన్నారు. ‘ఎవరూ అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు. ఈ విషయం గురించి రేవంత్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. వారిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. సహచరులు. అంతే’ అని పేర్కొన్నారు.
Similar News
News July 6, 2024
ఆ రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న సాలకట్ల ఆణివార ఆస్థాన పర్వదినం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు గమనించాలని పేర్కొంది.
News July 6, 2024
నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
News July 6, 2024
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం
AP: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని ఆర్కియాలజీకి పంపగా.. ఆ లిపి 14,15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి.