News July 3, 2024
రేవంత్, చంద్రబాబు గురుశిష్యులు కాదు: భట్టి

TG: సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు గురుశిష్యులు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వారిద్దరూ సహచరులు మాత్రమేనని మీడియాతో చిట్చాట్ సందర్భంగా పేర్కొన్నారు. ‘ఎవరూ అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు. ఈ విషయం గురించి రేవంత్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. వారిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. సహచరులు. అంతే’ అని పేర్కొన్నారు.
Similar News
News December 24, 2025
ప్రభుత్వాన్ని నిలదీసేలా BRS వ్యూహరచన

TG: నీటి ప్రాజెక్టులపై INC అన్యాయం చేస్తోందని, దీనిపై తానే రంగంలోకి దిగుతానని KCR ఇటీవల ప్రకటించారు. దీంతో GOVT అవే అంశాలపై ఈనెల 29 నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభలో ప్రాజెక్టులు సహా కీలకాంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను హరీశ్, KTR, జగదీశ్ రెడ్డి, తలసానికి KCR అప్పగించారు. రైతు సమస్యలపై MLAలను రెడీ చేస్తున్నారు. అయితే ఆయన సభకు వస్తారా లేదా అనేదే సందిగ్ధంగా ఉంది.
News December 24, 2025
RCFLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<
News December 24, 2025
రాళ్లు పెరుగుతాయా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

భూమి పుట్టుక నుంచి నేటి వరకు జరిగిన మార్పులకు రాళ్లు సజీవ సాక్ష్యాలని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లు ప్రధానంగా 3 రకాలు. అగ్నిపర్వత లావాతో ఏర్పడే ఇగ్నియస్, ఇసుక-మట్టి పొరలతో తయారయ్యే సెడిమెంటరీ, ఒత్తిడి వల్ల రూపాంతరం చెందే మెటామార్ఫిక్. రాళ్లు పెరగవని, వాతావరణ మార్పుల వల్ల అరిగిపోతాయన్నారు. ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్జ్ వల్ల తెల్లగా, కార్బన్ ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయి.


