News February 4, 2025

కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన రేవంత్

image

TG: కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేశామన్నారు. 50 రోజుల పాటు సర్వే చేశామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసమే ఈ సర్వే నిర్వహించామని వెల్లడించారు.

Similar News

News October 20, 2025

కూతుళ్లు అలా చేస్తే కాళ్లు విరగ్గొట్టాలి: ప్రజ్ఞా ఠాకూర్‌

image

భోపాల్(MP) మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హిందూయేతర పురుషుడి వద్దకు మనమ్మాయి వెళ్తానంటే కాళ్లు విరగ్గొట్టాలి. మన విలువలు పాటించని వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లల భవిష్యత్ కోసం కొట్టినా ఫరవాలేదు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతాం. కానీ పెద్దయ్యాక ఇతర మతస్థుడి ఇంటికి భార్యగా వెళ్తుంది. అలా జరగకుండా చూడాలి’ అని ఓ రిలీజియస్ ఈవెంట్లో సూచించారు.

News October 20, 2025

వంటింటి చిట్కాలు

image

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

News October 20, 2025

‘చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత

image

చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్‌రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.