News February 4, 2025
కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన రేవంత్

TG: కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేశామన్నారు. 50 రోజుల పాటు సర్వే చేశామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసమే ఈ సర్వే నిర్వహించామని వెల్లడించారు.
Similar News
News December 21, 2025
బిగ్బాస్ ఫినాలే.. ఇద్దరే మిగిలారు

తెలుగు బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలే కొనసాగుతోంది. టాప్-3 నుంచి డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యారు. హీరో రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షలు తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికే సంజన, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టాప్-2లో కళ్యాణ్, తనూజ నిలిచారు. కాసేపట్లో విన్నర్ ఎవరో తేలనుంది.
News December 21, 2025
సడన్గా బయటకు సార్..! కారణమేంటి..?

BRS శ్రేణులు సార్ అని పిలిచే KCR చాలాకాలం తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు. ఇకనుంచి ప్రజల్లోనే అని ప్రకటించారు. ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీకి కారణమేంటని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఎన్నికలై రెండేళ్లైనా బయటకు రాకుంటే తప్పుడు ప్రచారంతో ఉనికి ప్రశ్నార్థకం కావొచ్చనా? వచ్చే ఏడాది MPTC, ZPTC, GHMC ఎన్నికలు, 2028లో అసెంబ్లీ ఎన్నికలు వరుసగా ఉన్నాయనా? మీ కామెంట్?
News December 21, 2025
ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ అన్యాయం: రేవంత్

TG: కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం పెట్టిన ద్రోహి KCR అని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ఆ సంతకంతో 3 జిల్లాలకు మరణశాసనం రాశారని విమర్శించారు. ‘ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కాళేశ్వరం కూలినా వరి ఉత్పత్తిలో TGని అగ్రస్థానంలో నిలిపాం. కృష్ణా జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. పదేళ్ల KCR పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు’ అని చిట్చాట్లో మండిపడ్డారు.


