News May 7, 2025

మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నారు: KTR

image

TG: సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్- రాహుల్ ట్యాక్స్ వసూలవుతోందని, ఢిల్లీకి డబ్బుల సంచులు వెళ్తున్నాయని ఆరోపించారు. 100 శాతం రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.40వేల కోట్లు అప్పు చేస్తే, రేవంత్ ఒక్క ఏడాదిలోనే రూ.1.60లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు.

Similar News

News April 4, 2026

ఏపీ కొత్త మ్యాప్ విడుదల

image

అమరావతి రాజధానిగా 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి.

News April 4, 2026

భారత్‌కు మరో LPG ట్యాంకర్.. మొత్తం 8 నౌకలు

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ దాదాపు దిగ్బంధించినా భారత్‌కు మాత్రం ఊరట లభిస్తోంది. తాజాగా గ్రీన్ సాన్వీ అనే మరో LPG ట్యాంకర్ సేఫ్‌గా ఇండియాకు పయనమైంది. ఇప్పటి వరకు మన దేశానికి చెందిన 8నౌకలకు పర్మిషన్ లభించింది. మరే దేశానికి ఈ స్థాయిలో వెసులుబాటు లేకపోవడం మన దౌత్య విజయానికి నిదర్శనం. ‘మన ఉమ్మడి చరిత్రలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది’ అని ముంబైలోని ఇరాన్ ఎంబసీ శుక్రవారం పేర్కొనడం విశేషం.

News April 4, 2026

ఆ సమయంలో బ్రాహ్మణి బాధపడింది: లోకేశ్

image

AP: CBNను YCP Govt అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు కర్ణాటకలోని తెలుగు ప్రజలూ తమకు అండగా నిలిచారని మంత్రి లోకేశ్ అక్కడి సింధనూర్‌లో పేర్కొన్నారు. ఆనాడు ఎంతో వ్యథ అనుభవించామన్నారు. ‘గౌరవంతో బతికిన కుటుంబం మనది. పెద్దాయన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. ఎందుకీ పరిస్థితి. ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా? అని బ్రాహ్మణి బాధపడింది’ అని తెలిపారు. ప్రజలు వెంటే ఉన్నారని, వారికి రుణపడి ఉండాలని చెప్పానన్నారు.