News December 12, 2024
రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: KTR

TG: అర్ధసత్యాలు, అభూత కల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని CM రేవంత్ని KTR ప్రశ్నించారు. ‘మీ మాటలు అబద్ధం, మీ చేతలు అబద్ధం. కాకిలెక్కలతో మోసగించడమే మీ విధానమా? రూ.50-65వేల కోట్ల వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరికోసం? ఢిల్లీకి మూటలు మోసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగీ, లాగు వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News September 19, 2025
టుడే టాప్ స్టోరీస్

* జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి: CM చంద్రబాబు
* ఢిల్లీకి సీఎం రేవంత్.. పెట్టుబడులపై కంపెనీల ప్రతినిధులతో రేపు భేటీ
* ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్
* నకిలీ ఓట్ల వెనుక ఎవరున్నారో తెలియాలి: రాహుల్ గాంధీ
* ఓట్ల చోరీ ఆరోపణలు చేయడం రాహుల్కు అలవాటుగా మారింది: BJP
* OCT 1 నుంచి అమల్లోకి ఆన్లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
News September 19, 2025
బగ్రామ్ ఎయిర్బేస్ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

అఫ్గానిస్థాన్లోని బగ్రామ్ ఎయిర్బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్బేస్కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News September 19, 2025
ఈ అసెంబ్లీ సమావేశాలకూ వైసీపీ దూరం?

AP: YCP MLAలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్న పదేపదే కోరినా.. ఇవాళ YCP సభ్యులెవరూ సమావేశాలకు రాలేదు. ఇదే సమయంలో ఆ పార్టీ LP సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. మండలి సభ్యులే బలంగా పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.