News April 16, 2024

గెలిచిన ఎంపీలతో బీజేపీలోకి రేవంత్: KTR

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న కేటీఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు జరుగుతాయని అన్నారు. ముఖ్యమైన మార్పు సీఎం రేవంత్‌రెడ్డిదేనని, గెలిచిన ఎంపీలతో ఆయన బీజేపీలో చేరతారని మరోసారి బాంబు పేల్చారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరతారని ఈమధ్య పదేపదే కేటీఆర్ అంటుండటం గమనార్హం.

Similar News

News April 6, 2026

కమలం పార్టీకి 47 ఏళ్లు

image

ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. అటల్ బిహారి వాజ్‌పేయి, LK అద్వానీ దీన్ని స్థాపించారు. 1984లో తొలిసారి సాధారణ ఎన్నికలను ఎదుర్కొని కేవలం 2 సీట్లలోనే గెలిచింది. రామజన్మభూమి ఉద్యమంతో 1989లో 75 సీట్లు వచ్చాయి. 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1996, 98, 99లో వాజ్‌పేయి మూడు సార్లు ప్రధాని అయ్యారు. 2014 నుంచి మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు.

News April 6, 2026

బ్రాండింగ్ కోసం బౌండరీ దాటిన జొమాటో.. ఫ్యాన్స్ ఫైర్!

image

నిన్నటి IPL మ్యాచ్ సందర్భంగా జొమాటో చేసిన ఓ పోస్ట్ తమిళనాడు, కర్ణాటక అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘చెన్నై సాంబార్ కంటే బెంగళూరు సాంబార్ బెటర్’ అంటూ ZOMATO చేసిన పోస్ట్ తమ ప్రాంతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రచారం కోసం ప్రాంతీయ సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు. చాలామంది జొమాటో యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి పోస్టులు పెడుతున్నారు.

News April 6, 2026

కాలు వాపుగా ఉందా? ప్రాణాపాయం కావచ్చు: రాజీవ్ కనకాల

image

కాలు వాపు, నొప్పి లేదా వేడి చేసినా నిర్లక్ష్యం చేయవద్దని నటుడు రాజీవ్ కనకాల సూచించారు. ఇది రక్త గడ్డలకు (DVT) సంకేతం కావచ్చని హెచ్చరించారు. ‘ఈ గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం కలగవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం, లాంగ్ ట్రావెల్ చేసేవారు మధ్యమధ్యలో నడవాలి. నీళ్లు బాగా తాగాలి. సకాలంలో గుర్తిస్తే ఈ సమస్యను పూర్తిగా నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు’అని ఆయన అవగాహన కల్పించారు.