News April 16, 2024
గెలిచిన ఎంపీలతో బీజేపీలోకి రేవంత్: KTR

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో పాల్గొన్న కేటీఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు జరుగుతాయని అన్నారు. ముఖ్యమైన మార్పు సీఎం రేవంత్రెడ్డిదేనని, గెలిచిన ఎంపీలతో ఆయన బీజేపీలో చేరతారని మరోసారి బాంబు పేల్చారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరతారని ఈమధ్య పదేపదే కేటీఆర్ అంటుండటం గమనార్హం.
Similar News
News January 17, 2026
రేపు దావోస్కు సీఎం చంద్రబాబు బృందం

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.
News January 17, 2026
ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It
News January 17, 2026
DRDOలో JRF, RA పోస్టులు

<


