News May 10, 2024
రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రాభివృద్ధిని గాడిద గుడ్డుతో పోల్చేందుకు సిగ్గుండాలంటూ సీఎం రేవంత్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ‘రేవంత్ తలపై గాడిదగుడ్డుతో సభలకు వెళ్తున్నారు. సిగ్గుండాలి. రాష్ట్రం కోసం కేంద్రం రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తే సీఎం దాన్ని గాడిదగుడ్డుతో పోలుస్తున్నారు. మేం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. రేవంత్ మిడిమిడి జ్ఞానంతో బీజేపీని విమర్శిస్తున్నారు’ అని మండిపడ్డారు.
Similar News
News October 25, 2025
ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్: 6 నెలల్లో 30 వేల మంది బాధితులు

దేశంలో ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్కు వేలాది మంది బాధితులుగా మారుతున్నారు. గత 6 నెలల్లో ఏకంగా 30 వేల మంది రూ.1,500 కోట్లకు పైగా నష్టపోయారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వెల్లడించింది. బాధితుల్లో 30-60 ఏళ్ల వారే ఎక్కువని, 65% స్కామ్స్ ఢిల్లీ-NCR, బెంగళూరు, హైదరాబాద్లోనే నమోదయ్యాయని చెప్పింది. 26.38%తో బెంగళూరు తొలిస్థానంలో ఉందని, ఢిల్లీలో సగటున ఒక్కొక్కరు 8 లక్షలు నష్టపోయారని పేర్కొంది.
News October 25, 2025
బాబా ఫరీద్ యూనివర్సిటీలో 348 ఉద్యోగాలు

పంజాబ్లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ 348 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 40 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://recruitment.ggsmch.org/
News October 25, 2025
ఏఐ ఫేక్ వీడియో, ఇమేజ్లపై ECI ఆదేశాలు

బిహార్ ఎన్నికల్లో AIవీడియోలు, ఇమేజ్లతో ప్రచారాలు మిన్నంటాయి. వీటిలో కొన్ని ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఉండటంతో EC కొత్త రూల్స్ ప్రకటించింది. వీడియో, ఇమేజ్ల పైభాగంలో స్పష్టమైన లేబుల్ ఉండాలి. తయారీదారు పేరుండాలి. అవమానపరిచేలా, అనుమతిలేని ఇతరుల స్వరాలు, స్వరూపాలతో ఆడియో, వీడియోలు ప్రచారం చేయరాదు. తప్పుడు కంటెంట్ ఉంటే 3గం.లో హ్యాండిళ్ల నుంచి తొలగిస్తారు. పార్టీలు వీటిపై రికార్డులు నిర్వహించాలి.


