News August 21, 2024
రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే రేవంత్ చిల్లర భాష: కేటీఆర్

TG: సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని అందుకు నిరసనగా రేపు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తామని కేటీఆర్ అన్నారు. ‘రుణమాఫీపై దృష్టిని మరల్చేందుకు రేవంత్ చిల్లర భాష ఉపయోగిస్తున్నారు. KCRను తిడితే కొన్ని మీడియా సంస్థలు సంతోష పడుతున్నాయి. కానీ మేం డైవర్ట్ కాము. రైతుల పక్షానే పోరాడతాం. ఆంక్షలు లేకుండా ఎప్పటివరకు రుణమాఫీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 6, 2025
ఇండిగో.. రిఫండ్ చేస్తే సరిపోతుందా?

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో వేలమంది ఇబ్బంది పడ్డారు. CEO సారీ కూడా చెప్పారు. టికెట్ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. చాలామంది జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో వాళ్లు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్స్ రిఫండ్ చేస్తాయో లేదో తెలీదు. వేరే ఫ్లైట్స్కి వెళ్లిన వాళ్లు రూ.7 వేల టికెట్ని రూ.50 వేలకు కొన్నారు. ఇలా ఏదోలా ప్రయాణికులు నష్టపోయారు. మరి ఇండిగో కేవలం టికెట్ డబ్బు రిఫండ్ చేస్తే సరిపోతుందా? COMMENT.
News December 6, 2025
40 ఏళ్లు వచ్చాయా? ఈ అలవాట్లు మానేస్తే బెటర్

40 ఏళ్లు దాటిన తర్వాత ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి సరిపడవు. చిప్స్, కేక్స్, కుకీస్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. ఒత్తిడితో కార్టిసాల్ విడుదలై హై బీపీ, షుగర్, మెమొరీ లాస్కు కారణమవుతుంది. స్క్రీన్ ఎక్కువ చూస్తే గుండె జబ్బులు, మధుమేహ సమస్యల ప్రమాదం ఉంటుంది. స్మోకింగ్, డ్రింకింగ్కు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా బ్లడ్, థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 6, 2025
‘RO-KO’ని దాటేసిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025లో మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్లో టాప్ ప్లేస్ సాధించారు. ఐపీఎల్తో ఈ యంగ్స్టర్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. రెండో స్థానంలో ప్రియాన్ష్ ఆర్య, మూడో స్థానంలో అభిషేక్ శర్మ, షేక్ రషీద్ నాలుగో స్థానం, జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో నిలిచారు. IPL 2025, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బజ్ ఉన్నా రోహిత్, కోహ్లీ ఈ లిస్టులో పేర్లు సాధించలేకపోయారు.


