News October 27, 2024
కేటీఆర్ బంధువులను రేవంత్ టార్గెట్ చేశారు: ప్రశాంత్ రెడ్డి
TG: కేటీఆర్ బంధువులను రేవంత్ టార్గెట్ చేశారని BRS నేత ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ బావమరిది సొంతింటి గృహప్రవేశంలో కుటుంబ సభ్యులను కలుసుకుంటే పోలీసులు సీన్ మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ ఎదుగుదల ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు జన్వాడలో పార్టీ జరిగితే రాయదుర్గంలో రచ్చ చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
Similar News
News October 27, 2024
భారత్ ఓటమి
న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ డివైన్(79), సుజీ బేట్స్(58) రాణించడంతో 259 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ టాపార్డర్ విఫలమవ్వడంతో 183 పరుగులకే ఆలౌటైంది. జట్టులో రాధా యాదవ్(48) టాప్ స్కోరర్. NZ విజయంతో సిరీస్ సమమైంది. కాగా సిరీస్ విజేతను నిర్ధారించే మూడో వన్డే 29న జరగనుంది.
News October 27, 2024
సంచలనంగా జన్వాడ ఫాంహౌస్ పార్టీ!
తెలంగాణ రాజకీయాల్లో జన్వాడ ఫాంహౌస్ పార్టీ సంచలనంగా మారింది. KTR బావమరిది పాకాల రాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు KTRను టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఫాంహౌస్లో డ్రగ్స్ లభించలేదని, పర్మిషన్ లేని లిక్కర్ వాడినంత మాత్రాన కేసులేంటని BRS కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ పార్టీ అంటున్నారు.
News October 27, 2024
ఎల్లుండి ఉ.10 గంటల నుంచి..
AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ.10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు.