News October 27, 2024

కేటీఆర్ బంధువులను రేవంత్ టార్గెట్ చేశారు: ప్రశాంత్ రెడ్డి

image

TG: కేటీఆర్ బంధువులను రేవంత్ టార్గెట్ చేశారని BRS నేత ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ బావమరిది సొంతింటి గృహప్రవేశంలో కుటుంబ సభ్యులను కలుసుకుంటే పోలీసులు సీన్ మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ ఎదుగుదల ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు జన్వాడలో పార్టీ జరిగితే రాయదుర్గంలో రచ్చ చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

Similar News

News October 28, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడిపై రూ.750 పతనమై రూ.1,12,250గా ఉంది. అటు వెండిపై రూ.5,000 తగ్గింది. కేజీ సిల్వర్ ధర రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 28, 2025

తుఫాను ఎఫెక్ట్.. ఎక్కడ ఏం జరుగుతోంది!

image

✎ తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
✎ VJA కొండపై నివసించే ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు
✎ VZM జిల్లాలో 69 ముంపు ప్రాంతాల గుర్తింపు, 71 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
✎ నిలకడగానే ప్రవహిస్తున్న వంశధార, నాగావళి నదులు
✎ పెన్నా, సంగం బ్యారేజీలకు భారీగా వరద నీరు
✎ ధ్వంసమైన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్.. అలలకు రోడ్డుపైకి చేరుతున్న రాళ్లు

News October 28, 2025

భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్

image

హీరోయిన్లకు యాక్షన్ సీన్లుంటే వాటికోసం స్టంట్ ఉమన్లు ఉంటారు. కానీ 50ఏళ్ల క్రితం ఓ మహిళ ఇలా స్టంట్లు చేసిందంటే నమ్ముతారా? ఆమే భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్ రేష్మా పఠాన్. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 400 కి పైగా చిత్రాల్లో ఆమె స్టంట్లు చేశారు. షోలే సినిమా తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆమె సేవలకుగాను ‘ఫిలిం క్రిటిక్స్ గిల్డ్’ రేష్మాను ఫస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డుతో సత్కరించింది.