News August 29, 2024

రేవంత్ ఓటుకు నోటు కేసు: 2PMకు సుప్రీం ఆదేశాలు

image

TG CM రేవంత్ రెడ్డి ‘ఓటుకు నోటు కేసు’ విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ విచారణను తెలంగాణ నుంచి భోపాల్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న BRS పిటిషన్‌పై వాదనలు విన్నది. TG సహచరులను సంప్రదించి 2PMకు ఆదేశాలు ఇస్తామంది. బదిలీ పిటిషన్లను విచారిస్తే తమ న్యాయ అధికారులను తామే నమ్మనట్టు అవుతుందని పేర్కొంది. CM వద్దే హోం బాధ్యతలు ఉన్నాయని BRS లాయర్లు ఇందుకు బదులిచ్చారు.

Similar News

News November 22, 2025

కరీంనగర్: సర్వర్ డౌన్.. ‘సర్టిఫికేట్ల సేవలు బంద్’..!

image

కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(CDMA) సర్వర్ డౌన్‌తో రాష్ట్రంలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. దీంతో ఉమ్మడి KNR జిల్లాలో దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా మున్సిపల్ కార్యాలయాలల్లో సర్టిఫికేట్ల నమోదు, జారీ ప్రక్రియ ఆగిపోయింది. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు 4 రోజులుగా నెట్వర్క్ కంపెనీతో సంప్రదిస్తున్నా సమస్య అలానే ఉంది.

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.