News July 8, 2024

చంద్రబాబు, జగన్‌, పవన్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

image

APలో ప్రతిపక్షమనేదే లేదని YSR జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఇక్కడ ఉన్నదంతా పాలకపక్షమే. బీజేపీ అధికారంలో ఉంది. BJP అంటే బాబు, జగన్, పవన్. వీళ్లంతా మోదీ పక్షమే. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది షర్మిల ఒక్కరే. 2029లో ఆమె ఏపీ సీఎం అవుతారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, ఆమె పోరాటం వృథా కాదు’ అని మంగళగిరిలో జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News October 6, 2024

అందరి కళ్లు అతడిపైనే!

image

మరికొద్ది గంటల్లో బంగ్లాదేశ్‌తో తొలి T20 ప్రారంభం కానుంది. అయితే తొలిసారి భారత జట్టుకు ఎంపికైన యంగ్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ మయాంక్‌ ఆడితే అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. IPLలో లక్నో తరఫున ఆడిన ఈ యువ పేసర్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. కాగా ఇతడికి హర్షిత్‌రాణా రూపంలో పోటీ ఉంది. ఇద్దరిలో మీ ఓటు ఎవరికి?

News October 6, 2024

ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ బాబు: VSR

image

AP: రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తుంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు మనోగతం! రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. దసరా పండుగ అయిపోవస్తోంది. ఇప్పుడు అర్జంట్‌గా బైబిల్ కావాలి. ఎక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తోంది. వేషం మార్చాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 6, 2024

ఇజ్రాయెల్‌ దాడిలో 26మంది మృతి: హమాస్

image

గాజాపై ఇజ్రాయెల్ చేసిన తాజా దాడిలో ఓ మసీదులో 26మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాలో ఉన్న ఆ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారని పేర్కొంది. అనేకమంది తీవ్రగాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు ఇజ్రాయెల్ ఆ ప్రకటనను ఖండించింది. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని తాము అత్యంత కచ్చితత్వంగా గుర్తించి ధ్వంసం చేశామని, అందులో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని పేర్కొంది.