News December 3, 2024

డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సులు

image

AP: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహించనుంది. భూ వివాదాలకు పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యల్లో 10శాతం థర్డ్ పార్టీ ద్వారా పరిశీలిస్తామని అనగాని తెలిపారు. అటు గ్రామ సభల్లో ప్రజల ఫిర్యాదులపై రసీదులు ఇస్తామన్నారు.

Similar News

News December 6, 2025

ఉల్లి పండిన నేలలో మల్లీ పూస్తుంది..

image

ఉల్లి సాగు సాధారణంగా శ్రమతో కూడుకున్నది. కొన్నిసార్లు కన్నీళ్లతో (ఉల్లి కోసేటప్పుడు) ముడిపడి ఉంటుంది. అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్న నేలలో కూడా మంచి సస్యరక్షణ చేపడితే మల్లె వంటి సువాసనగల, అందమైన పంట పెరుగుతుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలతో కూడిన ఒక దశ ముగిసిన తర్వాత, అందమైన, సంతోషంతో కూడిన దశ ప్రారంభమవుతుందని, అంతా అయిపోయిన చోటు నుంచే కొత్త ఆశలు చిగురిస్తాయని ఈ సామెత అర్థం.

News December 6, 2025

శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని శనివారం రోజున నైవేద్యంగా పెడితే..?

image

శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదమంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. శనివారం ఆయనకు అటుకులు, అన్నం, బెల్లం, కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగి, ఇంట్లో ధనవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని ఆయనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచితే.. సంకటాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు సుగుణాల భర్త వస్తాడని నమ్మకం.

News December 6, 2025

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. నిన్న APలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.