News December 3, 2024
డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సులు

AP: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహించనుంది. భూ వివాదాలకు పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యల్లో 10శాతం థర్డ్ పార్టీ ద్వారా పరిశీలిస్తామని అనగాని తెలిపారు. అటు గ్రామ సభల్లో ప్రజల ఫిర్యాదులపై రసీదులు ఇస్తామన్నారు.
Similar News
News January 8, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ రెనెవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (<
News January 8, 2026
పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.
News January 8, 2026
ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఉపయోగాలు

తొమ్మిది నెలల ప్రయాణంలో శిశువు ఎదుగుదల సజావుగా ఉంటే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. కడుపులో బిడ్డ సౌకర్యంగా సాగడానికి ఉమ్మనీరు చాలా అవసరం. ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఒత్తిడి, దెబ్బతగిలినా ఏం కాకుండా కాపాడుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, బేబీ తక్కువ మూత్రం పోవడంతో ఉమ్మనీరు తగ్గుతుంది. ఇలాంటి వారికి అవసరమైతే తొందరగా ప్రసవం చేయాల్సి రావొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.


