News September 10, 2024
M&M, డాక్టర్ రెడ్డీస్ నుంచి సెబీ చీఫ్కు కోట్లలో ఆదాయం: కాంగ్రెస్

M&M, డాక్టర్ రెడ్డీస్ సహా ఇతర లిస్టెడ్ కంపెనీల నుంచి సెబీ చీఫ్ మాధబీ బుచ్ రూ.కోట్లలో ఆదాయం పొందారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. సెబీలో చేరినప్పటి నుంచి ఆమెకు చెందిన అగోరా అడ్వైజర్ కంపెనీ సుప్తావస్థలో ఉందంటున్నా 2016-2024 మధ్య రూ.2.95 కోట్లు పొందారని పేర్కొన్నారు. పిడిలైట్, ICICI, సెంబ్కార్ప్, విసు లీజింగ్ వారి క్లెయింట్లేనని చెప్పారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందన్నారు.
Similar News
News November 28, 2025
అమ్మానాన్నల మీద నిందలు వేస్తున్నారా..?

మాతృ నింద మహా వ్యాధిః పితృ నింద పిశాచతః
దైవ నింద దరిద్ర స్యాత్ గురు నింద కుల క్షయం
ఈ శ్లోకం ప్రకారం.. తల్లిని నిందించే వారికి వ్యాధులు కలుగుతాయి. తండ్రిని నిందిస్తే పిశాచత్వం ప్రాప్తిస్తుంది. దైవ నిందతో దరిద్రులవుతారు. అలాగే గురువును నిందించినట్లయితే వంశమే నాశనం అవుతుందట. అందుకే జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పే గురువులను, లోకాన్ని సృష్టించిన దైవాన్ని ఎప్పుడూ నిందించకూడదని అంటారు.
News November 28, 2025
WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్ల హవా

WPL మెగా వేలంలో తెలుగు ప్లేయర్లను అదృష్టం వరించింది. కరీంనగర్(D) రామగుండంకు చెందిన శిఖా పాండే(ఆల్ రౌండర్)కు అనూహ్య ధర దక్కింది. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా ఆమెను UP రూ.2.4కోట్లకు కొనుగోలు చేసింది. లేటెస్ట్ వరల్డ్ కప్ సెన్సేషన్ శ్రీచరణి రూ.1.30కోట్లకు DC సొంతం చేసుకుంది. అరుంధతిరెడ్డిని రూ.75లక్షలకు RCB, త్రిష UP, క్రాంతిరెడ్డి MI, మమత కోసం DC రూ.10 లక్షల చొప్పున వెచ్చించాయి.
News November 28, 2025
నేడు అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా, మూవీ టీం ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. ఇవాళ HYDలోని కూకట్పల్లిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. ‘అఖండ’ చిత్రం ఉత్తరాదిలోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్పై హిందీ రాష్ట్రాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


