News August 23, 2024
ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్

SC రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. జైశ్రీపాటిల్ అనే న్యాయవాది ఈ తీర్పును సమీక్షించాలని కోరారు. ‘SC, STల రిజర్వేషన్ల విషయంలో 1950 నాటి ఉత్తర్వులను సవరించే అధికారం పార్లమెంట్కు తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఆర్టికల్ 341, 342 ప్రకారం వర్గీకరించే అధికారం రాష్ట్రపతి, పార్లమెంట్కు మాత్రమే ఉంది’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News March 16, 2026
నాగార్జునసాగర్ తీరంలో సైక్లింగ్ జోష్

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్కు వచ్చే సందర్శకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాగర్ తీరంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ప్రారంభించారు. విజయవిహార్ అతిథి గృహంలో ప్రస్తుతానికి 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. పర్యాటకులు గంటకు రూ.100 చొప్పున చెల్లించి ఈ సైకిళ్లను వినియోగించుకోవచ్చు.
News March 16, 2026
టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.
News March 16, 2026
సిగరెట్, మద్యంతో మతిమరుపు!

వయసుతో సంబంధం లేకుండా కొన్ని అలవాట్లు మెదడు పరిమాణాన్ని తగ్గిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘నిద్రలేమి, ఒత్తిడి, ఊబకాయం, మధుమేహం, వ్యాయామం లేకపోవడం వల్ల మెదడు వేగంగా కుంచించుకుపోతుంది. విటమిన్ B12 లోపం, ఒంటరితనం, ధూమపానం, మద్యపానం వల్ల కూడా పరిమాణం తగ్గి మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది. సరైన నిద్ర, పౌష్టికాహారం, రోజూ వ్యాయామం చేసి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు.


