News October 24, 2024

వర్సిటీల ప్రగతిపై 3 నెలలకోసారి సమీక్షిస్తా: గవర్నర్

image

TG: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవుతానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. విద్యాపరంగా సాధించిన వృద్ధిపై సమీక్ష చేపడతానని చెప్పారు. ఉన్నత విద్య రూపురేఖలు మార్చడంలో వీసీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య, విస్తృతమైన పరిశోధనలు, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారేందుకు కృషి చేయాలని తనను కలిసిన కొత్త వీసీలకు సూచించారు.

Similar News

News October 24, 2024

షర్మిలను బెదిరిస్తున్న సైకో జగన్: TDP

image

AP: చెల్లి రాజకీయాల్లో ఉంటే సైకో జగన్ తట్టుకోలేకపోతున్నారని TDP విమర్శించింది. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తానని షర్మిలను బెదిరిస్తున్నారని ఆరోపించింది. ‘రాజకీయంగా నాకు అడ్డు రాకు. అప్పుడే ఆస్తులు రాసిస్తా. నన్ను ఇబ్బందులు పెడుతుంటే నీకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి. అమ్మపై, నీపై కేసు వేస్తున్నా’ అని షర్మిలకు జగన్‌ లేఖ రాశారని ట్వీట్ చేసింది.

News October 24, 2024

ఈవినింగ్ టైం బీటెక్.. గుడ్‌న్యూస్ చెప్పిన JNTUH

image

TG: పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారికి JNTUH గుడ్ న్యూస్ చెప్పింది. సాయంత్రం వేళ బీటెక్ చదువుకోవాలి అనుకునే వారికి JNTUHతో పాటు మరో 8 కాలేజీలకు అనుమతిచ్చింది. త్వరలో స్పాట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. కోర్సు కాలపరిమితి మూడేళ్లు కాగా ఒక్కో విభాగంలో 30 సీట్లు ఉంటాయి. పని చేస్తున్న సంస్థ కాలేజీకి 75km పరిధిలో ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి.

News October 24, 2024

బాస్మతియేతర బియ్యంపై ఎంఈపీ తొలగింపు

image

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు గాను గతంలో నిర్దేశించిన కనీస ఎగుమతి ధరను కేంద్రం తొలగించింది. గత నెలలో ఈ బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధరను(MEP) నిర్ణయించింది. తాజాగా దానిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశంలో ఈ బియ్యం నిల్వలు పరిమితంగా ఉండటంతో గతేడాది జులై 20న వీటి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.