News September 21, 2024
గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ: మంత్రి

TG: రెవెన్యూ ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రెవెన్యూ ఉద్యోగులతో ఆయన భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో గజం ప్రభుత్వ భూమి కూడా కబ్జా కావొద్దు. ఇందులో రాజీ పడొద్దు. ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని పునరుద్ధరిస్తాం. దీనికి సంబంధించి ఈ నెల 29న MRO స్థాయి, అక్టోబర్ 6న RDO, అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో చర్చిస్తాం’ అని మంత్రి తెలిపారు.
Similar News
News November 27, 2025
దక్షిణామూర్తి ఎవరు?

దక్షిణామూర్తి సకల విద్యలకు, తత్వజ్ఞానానికి ఆది గురువు. ఆయన మౌనంగా ఉంటూనే కేవలం చిన్ముద్ర ద్వారా శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఆయనను పూజిస్తే అజ్ఞానం తొలగి, బుద్ధి వికసించి, ఏకాగ్రత పెరుగుతుందని నమ్మకం. గురువు లేనివారు ఆయనను తమ సద్గురుగా భావించి పూజిస్తారు. శ్రీరాముడి గురువు అయిన వశిష్టుడు కూడా ఈయన దగ్గరే బ్రహ్మవిద్యను సంపాదించాడని పురాణాలు చెబుతున్నాయి.
News November 27, 2025
భారత్ వైట్ వాష్.. తప్పెవరిది?

SAతో 2 టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిపోవడాన్ని భారత ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటర్ల డిఫెన్స్ టెక్నిక్ పేలవంగా ఉందని, T20 ఫార్మాట్ అలవాటై గంటల కొద్దీ బ్యాటింగ్ చేసే ఓపిక నశించిందని అంటున్నారు. అటు ఎక్కువశాతం కోచ్ గంభీర్పై ఫైర్ అవుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు, టీం సెలక్షన్ సరిగా చేయలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇంతకీ వైట్ వాష్కి కారణం ప్లేయర్లా, కోచ్ గంభీరా? కామెంట్ చేయండి.
News November 27, 2025
ఆవు పేడతో అలుకుత ఎందుకు చల్లాలి?

పూజలు, శుభకార్యాల సమయంలో ఆవు పేడతో అలుకుత చల్లే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆవు పేడ ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. కీటకాలను దూరం చేసే సహజ సిద్ధమైన పరిష్కారంగా దీన్ని భావిస్తారు. అప్పట్లో రసాయన క్రిమిసంహారకాలు ఉండేవి కాదు. అందుకే ఆ రోజుల్లో నేలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, సానుకూల శక్తిని నింపడానికి ఈ పద్ధతిని ఆచరించేవారు.


