News September 13, 2025

మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ విడుదల

image

TG: 4,079 మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.11 కోట్ల రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేసింది. ఒక్కో సంఘానికి రూ.15,000 కేటాయించనుంది. ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షిస్తాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 397 సంఘాలకు, అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలో 3 సంఘాలకు నిధులు అందనున్నట్లు సమాచారం.

Similar News

News September 13, 2025

పిల్లలు మట్టి తింటున్నారా?

image

పిల్లలు ఎదిగేటప్పుడు చేతికి అందిన వస్తువులన్నీ నోట్లో పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు మట్టి, సుద్ద, బొగ్గులు తింటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో పైకా అంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఐరన్​ లోపం, రక్తలేమి, ఆహారలేమి ఉన్న పిల్లలు ఇలాంటి పదార్థాలు తింటారని వెల్లడిస్తున్నారు. కాబట్టి పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని, సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News September 13, 2025

డిగ్రీ అర్హతతో 394 జాబ్స్.. ఒక్క రోజే ఛాన్స్

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ(SEP 14). డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు <>www.mha.gov.in<<>> వెబ్‌సైటును సంప్రదించగలరు.
#ShareIt

News September 13, 2025

మేం ఏ జట్టునైనా ఓడిస్తాం: పాక్ కెప్టెన్

image

తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడిస్తామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. భారత్‌తో మ్యాచ్ గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. ‘మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌లో ఇంకా బెటర్ అవ్వాలి. ఇటీవల మా ఆటతీరు బాగుంది. ట్రై సిరీస్‌ను కూడా ఈజీగా విన్ అయ్యాం’ అని ఒమన్‌తో మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించారు. ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా రేపు భారత్, పాక్ తలపడనున్న విషయం తెలిసిందే.