News May 6, 2024
REWIND: ఒకే గ్రామం నుంచి ఇద్దరు MLAలు

చాట్రాయికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది చట్ట సభల్లో అడుగుపెట్టారు. తొలుత మిర్యాల పూర్ణనంద్ తిరువూరు(ఎస్సీ) నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా 1983లో గెలుపోందారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చాట్రాయి మండలం నూజివీడు జనరల్ స్థానంలోకి వచ్చింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చాట్రాయికే చెందిన చిన్నం రామకోటయ్య నూజివీడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
Similar News
News April 22, 2025
కృష్ణా : ‘కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం తగదు’

కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.
News April 21, 2025
కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.
News April 21, 2025
కృష్ణా: 131 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత

జిల్లాలో 131 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు సైకిళ్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించారు. మెడికల్ క్యాంప్ల ద్వారా గుర్తించిన వీరికి రూ.15లక్షలు విలువ చేసే ట్రై సైకిల్స్, ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరితోపాటు పాఠశాలల్లో సమానంగా చదువుకోవడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.