News December 30, 2024
REWIND: కరీంనగర్ జిల్లాను వణికించిన భూకంపం

కరీంనగర్ జిల్లాలో ఈ నెల 4న ఉదయం 7:28 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. గోదావరి నది తీరా ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. 2024లో సంభవించిన భూకంపం ఉమ్మడి జిల్లా ప్రజలను ఒక్కసారిగా వణికించిందని చెప్పవచ్చు.
Similar News
News November 28, 2025
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీ

సర్పంచ్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపడతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.
News November 28, 2025
KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.
News November 28, 2025
KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.


