News April 5, 2024
REWIND: గుడివాడలో టీడీపీకి ఆధిక్యం తెచ్చిన క్రాస్ ఓటింగ్

2019లో గుడివాడలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అవినాశ్కు 70,354 ఓట్లు రాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 75,790ఓట్లు లభించాయి. 2019లో క్రాస్ ఓటింగ్ కారణంగా గుడివాడలో ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 751ఓట్ల ఆధిక్యం లభించింది. గుడివాడలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బాలశౌరికి 75,039ఓట్లు దక్కగా, MLA అభ్యర్థి నాని 89,833ఓట్లు సాధించి అవినాశ్పై 19,479ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సారి క్రాస్ ఓటింగ్ ఉంటుందా.. మీ కామెంట్
Similar News
News December 17, 2025
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో కృష్ణా జిల్లాకే అగ్రస్థానం.!

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం దక్కించుకుంది. మంగళవారం వరకు జిల్లాలో 3,83,127 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు తెలిపారు. 49,132 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటికే 47,182 మంది రైతులకు రూ. 864.72 కోట్లు జమ చేశారు. మిగిలిన రైతులకు త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు వివరించారు.
News December 17, 2025
కృష్ణా: గొబ్బెమ్మల పూజలతో గ్రామాల్లో సంక్రాంతి సందడి షురూ

ధనుర్మాసం ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు మంచును సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే ఆవు పేడతో సంప్రదాయ గొబ్బెమ్మలు తయారు చేసి, గృహాల ముందు ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో గొబ్బెమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.
News December 16, 2025
కృష్ణాజిల్లా TDP అధ్యక్షుడిగా గురుమూర్తి.?

TDP కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా వీరంకి వెంకట గురుమూర్తి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. తోట్లవల్లూరుకు చెందిన గురుమూర్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన TDPలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పదవులను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారు.


