News April 9, 2025
REWIND: నిర్మల్లో ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో నిర్మల్లో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు, అతడి 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News November 20, 2025
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా?

AP: నిధులు జమకాని రైతులు annadathasukhibhava.ap.gov.in వెబ్సైట్లో Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. ఆధార్ నంబర్, పక్కన క్యాప్చా ఎంటర్ చేయాలి. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అందిన మొత్తం, తేదీ, ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది. సక్సెస్ అంటే డబ్బు జమైందని అర్థం. Pending/Rejected అంటే ఇంకా జమ కాలేదు, నిరాకరించబడిందని అర్థం. మీకు ఏమైనా సందేహాలుంటే గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.
News November 20, 2025
సిద్దిపేట: అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

ప్రేమ వివాహం చేసుకున్న యువతి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజిపేట బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 5 నెలల క్రితం గజ్వేల్ మండలం చిన్న ఆరేపల్లికి చెందిన యువతి సదా అఫ్రీన్ (21), అలిరాజపేట గ్రామానికి చెందిన ఫరీద్ (22) అనే యువకుడు ఇద్దరు డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకుంన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 20, 2025
మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.


