News April 9, 2025
REWIND: నిర్మల్లో ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో నిర్మల్లో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు, అతడి 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News November 21, 2025
బాపుఘాట్లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం

HYDలో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈసా, మూసీ నదుల సంగమం బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పట్నాలోని గాంధీ మైదానంలో 72 అడుగుల కాంస్య విగ్రహం దేశంలోనే ఎత్తైంది. దీనికంటే ఎత్తైన విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News November 21, 2025
అనకాపల్లి: ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలి

ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం మంజూరు కోసం అర్హత కలిగిన లబ్ధిదారులు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలలో ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్తో దరఖాస్తు సమర్పించాలన్నారు. అర్బన్, రూరల్ హౌసింగ్ స్కీంలలో మూడు కేటగిరీల విభాగాలలో ఇల్లు మంజూరు చేస్తామన్నారు. స్థలం లేని వారికి స్థలంతో ఇళ్లు కూడా మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
News November 21, 2025
నేడు JNTUకి సీఎం రేవంత్ రెడ్డి

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు నేడు ఉ.10 గం.కు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరై లోగోను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా యూనివర్సిటీ నిర్వహిస్తున్న అలుమ్నీ మీటింగ్ కూడా ప్రారంభించి విద్యార్థులతో సీఎం మాట్లాడతారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


