News April 9, 2025

REWIND: నిర్మల్‌లో ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో నిర్మల్‌లో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు, అతడి 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

Similar News

News November 9, 2025

లాంచీలో శ్రీశైలం యాత్ర

image

TG: కృష్ణా నదిలో నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్‌కర్నూల్(D) సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర పున:ప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో భక్తులు సోమేశ్వరుడిని దర్శించుకున్నాక 9AMకు లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. నిర్వాహకులు భోజనం, స్నాక్స్ అందిస్తారు. వన్ సైడ్ జర్నీకి పెద్దలకు ₹2000, పిల్లలకు ₹1600 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు https://tgtdc.in/లో చూడగలరు.

News November 9, 2025

అన్ని దోషాలను పోగొట్టే రాహు కేతువు పూజ… మీరు చేయించుకున్నారా?

image

వివాహం కాకపోవడం, సంతాన సమస్యలు, ఆర్థిక, ఉద్యోగ ఆటంకాలతో ఇబ్బందులు పడుతున్నవారు, కాలసర్ప దోషం ఉన్నవారు రాహు కేతువు పూజ చేయించుకుంటారు. సకల దోషాలను పోగొట్టే అత్యంత శక్తిమంతమైన ఈ పూజ APలోని శ్రీకాళహస్తి, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ క్షేత్రాల్లో నిర్వహిస్తారు. దీని ఫలితంతో జాతక దోషాలు తొలగి, జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ పూజ తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలని పండితుల సూచన.

News November 9, 2025

కార్తీకం: ఆదివారం ఎవరికిలా పూజ చేయాలి?

image

ఆదివారం సూర్యుడిని పూజించాలని చెబుతారు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యుడు రాగానే ‘ఓం ఆదిత్యా నమ:’ అంటూ ఆయన పేర్లను స్తుతించాలని పండితుల సూచన. ‘ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. బెల్లం, పాలు, ఎరుపు వస్త్రాలు దాయడం ఉత్తమం. ఉపవాసం మంచిదే. ఉప్పు-నూనె లేని ఆహారం తినవచ్చు. కార్తీకంలో ఈ నియమాల వల్ల సూర్యానుగ్రహంతో జాతకంలో సూర్యుని స్థానం బలపడి శాంతి, మనశ్శాంతి లభిస్తాయి’ అంటున్నారు.