News April 9, 2025
REWIND: నిర్మల్లో ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో నిర్మల్లో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు, అతడి 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News December 9, 2025
ఏపీలో US పెట్టుబడులకు సహకరించండి: లోకేశ్

APకి 18నెలల్లో రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. దేశంలోనే తొలిసారి MOUల తర్వాత నిర్ణీత సమయంలో పరిశ్రమలను గ్రౌండింగ్ చేసే సంస్థలకు <<18509404>>ఎస్క్రో అకౌంట్<<>> ద్వారా ప్రోత్సాహకాలను జమ చేయనున్నట్లు చెప్పారు. అమరావతిలో అతి త్వరలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబోతోందని, APలో US పెట్టుబడులకు సహకరించాలని శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో భేటీ సందర్భంగా కోరారు.
News December 9, 2025
ఎస్క్రో అకౌంట్ అంటే?

ఎస్క్రో ఖాతా అనేది థర్డ్ పార్టీ నిర్వహించే తాత్కాలిక అకౌంట్. ఇందులో కొనుగోలుదారు, విక్రేతల లావాదేవీకి సంబంధించిన డబ్బు/ఆస్తులను ఉంచుతారు. ఒప్పందంలోని షరతులు నెరవేరిన తర్వాతే అవి సంబంధిత పార్టీలకు విడుదలవుతాయి. ఇది 2 పక్షాలకు భద్రతను అందిస్తుంది. ఎందుకంటే నిబంధనల ప్రకారం మాత్రమే చెల్లింపు జరుగుతుందని ఇది నిర్ధారిస్తుంది. మన దేశంలో ఎస్క్రో అనేది పరిశ్రమలు, వ్యాపారం తదితర లావాదేవీలలో ఉపయోగిస్తారు.
News December 9, 2025
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?

కొన్ని అలవాట్లు అశుభకరమని పండితులు చెబుతున్నారు. ‘మాటిమాటికి ప్రతిజ్ఞలు చేయడం, ఒట్లు వేయడం దోషం. నిలబడి, తిరుగుతూ అన్నం తింటే దరిద్రులవుతారు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరుక్కోవడం అశుభానికి సంకేతం. నదిలో ఉమ్మడం దైవ దూషణతో సమానం. కంచంను ఒడిలో పెట్టుకొని, పడుకొని తినకూడదు. కంచంలో చేయి కడగడం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు వీడితే శుభాలు కలిగి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది’ అని సూచిస్తున్నారు.


