News April 9, 2025
REWIND: నిర్మల్లో ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో నిర్మల్లో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు, అతడి 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News October 25, 2025
బాలానగర్: రఘునందన్పై శ్రీనివాస్ గౌడ్ గెలుపు

బాలానగర్లోని MTAR Technologies Ltd కంపెనీలో శనివారం యూనియన్ ఎన్నికలు జరిగాయి. కార్మికుల గుర్తింపు పొందిన భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై గెలుపొందారు. తనపై నమ్మకంతో గెలిపించిన కార్మికులందరికీ శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
News October 25, 2025
తుపాన్ హెచ్చరికలు.. కలెక్టర్ సమీక్ష

తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులతో సమీక్షించారు. 1513 చెరువుల గట్ల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని, ఇసుక బస్తాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా, మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తీవ్ర గాలుల సమయంలో బయటకు రావద్దని, నదుల్లోకి వెళ్లవద్దని కోరారు.
News October 25, 2025
జూబ్లీలో ఈసీ రూల్స్ ఫాలో కావాలి: సంజీవ్ కుమార్ లాల్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తప్పక పాటించాలని వ్యయ పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ అన్నారు. శనివారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారానికి చేసే ప్రతి పైసాను ఎన్నికల సంఘంకు తెలపాలన్నారు. ఖర్చులకు సంబంధించి పక్కగా డాక్యుమెంటేషన్ చేసుకోవాలని సంజీవ్ కుమార్ లాల్ స్పష్టం చేశారు.


