News March 8, 2025

Rewind: పల్నాడులో 23 మందిని చంపిన నిందితులకు క్షమాభిక్ష

image

32 ఏళ్ల క్రితం నరసరావుపేటలో 23 మందిని కాల్చి చంపేసిన ఘటనలో నిందితులు చలపతి, విజయవర్ధ‌న్‌ను 1993 మార్చి 18న పోలీసులు అరెస్ట్ చేశారు. 96 ఆగస్టు 28న సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది. 1997 మార్చి 29న వారి ఉరిశిక్షకు ఏర్పాట్లు చేశారు. వారు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్లో ఉండటంతో ఉరిశిక్ష వాయిదా వేయాలని సుప్రీమ్ ఆదేశించింది.

Similar News

News November 28, 2025

మాటల యుద్ధం: డీకే ఏమన్నారంటే?

image

కర్ణాటక సీఎం, తన మధ్య SMలో <<18406507>>మాటల యుద్ధం<<>> నడుస్తోందనే ప్రచారాన్ని Dy.CM డీకే శివకుమార్ కొట్టిపారేశారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్యాంగ దినోత్సవం వేళ పేర్కొన్న మాటలు అలా అర్థమయ్యాయని ముంబైలో తెలిపారు. అలాగే తాను రాజకీయ భేటీ కోసం ముంబై వచ్చాననే ఆరోపణలను ఖండించారు. ఫ్యామిలీ ప్రోగ్రాంకు హాజరైనట్లు, రాజకీయ భేటీ అయితే బెంగళూరు లేదా ఢిల్లీలో ఉంటుందని స్పష్టం చేశారు.

News November 28, 2025

పంచాయతీల విభజనకు గ్రీన్‌సిగ్నల్

image

AP: స్థానిక సంస్థల ఎన్నికలకు SEC సిద్ధమవుతోంది. అందులో భాగంగా గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఒక పంచాయతీని విభజించడం/పంచాయతీలోని గ్రామాలను మరో పంచాయతీలో కలపడం/2 పంచాయతీలను విలీనం చేయడానికి వీలవుతుంది. అలాగే పంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలపడానికి మార్గం సుగుమమవుతుంది. లోకల్ ఎలక్షన్స్‌కు ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

News November 28, 2025

ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాలు..

image

ఉపవాసం అనేది భక్తి మార్గం మాత్రమే కాదు. ఉపవాసం పాటిస్తే మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. తద్వారా మనసు దేవుడిపై నిలిచి, ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉపవాసం ఉంటే కొలెస్ట్రాల్, షుగర్ స్థాయి తగ్గి, పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. శరీరం తనకు తానుగా మరమ్మత్తులు చేసుకుని, వయస్సును వెనక్కి నెట్టి, మనం మరింత యంగ్‌గా కనిపించడానికి తోడ్పడుతుంది.