News March 8, 2025

Rewind: పల్నాడులో 23 మందిని చంపిన నిందితులకు క్షమాభిక్ష

image

32 ఏళ్ల క్రితం నరసరావుపేటలో 23 మందిని కాల్చి చంపేసిన ఘటనలో నిందితులు చలపతి, విజయవర్ధ‌న్‌ను 1993 మార్చి 18న పోలీసులు అరెస్ట్ చేశారు. 96 ఆగస్టు 28న సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది. 1997 మార్చి 29న వారి ఉరిశిక్షకు ఏర్పాట్లు చేశారు. వారు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్లో ఉండటంతో ఉరిశిక్ష వాయిదా వేయాలని సుప్రీమ్ ఆదేశించింది.

Similar News

News November 18, 2025

‘N-Bomma VS J-Bomma’ టీడీపీ, వైసీపీ విమర్శలు

image

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం iBOMMA గురించి చర్చ నడుస్తోంది. ఇదే థీమ్‌తో వైసీపీ, టీడీపీలు ట్విట్టర్ వార్‌కు దిగాయి. J-Bomma అంటూ జగన్ ఫొటోను షేర్ చేస్తూ TDP విమర్శలకు దిగింది. దీనికి కరెక్టెడ్ టూ N-Bomma అంటూ చంద్రబాబు ఫొటోను YCP కౌంటర్ ట్వీట్ చేసింది. నరహంతకుడు, శాడిస్ట్ చంద్రబాబు అంటూ రాసుకొచ్చింది.

News November 18, 2025

బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

image

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.

News November 18, 2025

అనకాపల్లి: ‘రోజుకు 30-40 సదరం స్లాట్స్’

image

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపు ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ క్యాంపునకు వచ్చిన దివ్యాంగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల అర్హత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రోజుకు 30-40 స్లాట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. దీనిని ఆధునీకరించాల్సి ఉందన్నారు.