News March 8, 2025

Rewind: పల్నాడులో 23 మందిని చంపిన నిందితులకు క్షమాభిక్ష

image

32 ఏళ్ల క్రితం నరసరావుపేటలో 23 మందిని కాల్చి చంపేసిన ఘటనలో నిందితులు చలపతి, విజయవర్ధ‌న్‌ను 1993 మార్చి 18న పోలీసులు అరెస్ట్ చేశారు. 96 ఆగస్టు 28న సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది. 1997 మార్చి 29న వారి ఉరిశిక్షకు ఏర్పాట్లు చేశారు. వారు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్లో ఉండటంతో ఉరిశిక్ష వాయిదా వేయాలని సుప్రీమ్ ఆదేశించింది.

Similar News

News January 9, 2026

తీవ్ర వాయుగుండం.. రేపు వర్షాలు: APSDMA

image

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటవచ్చంది.

News January 9, 2026

రాష్ట్ర పండుగగా సరే.. నిధులు మాటేమిటీ?: నేలపూడి

image

జగ్గన్నతోట ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించినా, నిధులు కేటాయించకపోవడంపై YCP రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు నేలపూడి స్టాలిన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో నంబర్-2లో ఆర్థిక అంశాల ప్రస్తావన లేదని ఆయన విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ తీర్థానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని, లేనిపక్షంలో అది కోనసీమ సంస్కృతిని అవమానించడమేనని పేర్కొన్నారు.

News January 9, 2026

సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

image

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్‌ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.