News December 26, 2024

REWIND: ‘ప్రకాశం జలప్రళయానికి 35 మంది బలి

image

సునామీ ఈ పేరు వింటేనే ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న ప్రకాశం జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 35 మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకుంటే.. ఆ భయం అలానే ఉందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.

Similar News

News January 26, 2025

కొండపి విద్యార్థుల క్రియేటివిటీ సూపర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కొండపి గురుకుల పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాని పోలిన నమూనాతో పాటు జాతీయ ఓటర్ల దినోత్సవం అక్షరమాల ఆకారంలో కూర్చున్నారు. ఈ చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది. విద్యార్థుల క్రియేటివిటీని పలువురు టీచర్లు అభినందించారు. అనంతరం ఓటు గురించి విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించారు.

News January 26, 2025

ప్రకాశం కలెక్టర్‌కు అవార్డు

image

ప్రకాశం క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారియాకు బెస్ట్ ఎల‌క్టోర‌ల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 ల‌భించింది. శ‌నివారం విజ‌య‌వాడ‌లోని జ‌రిగిన 15వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ చేతుల‌మీదుగా అందుకున్నారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌, అర్హులైన వారి ఓట‌రుగా న‌మోదు చేసుకునేందుకు అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు అవార్డు అందుకున్నారు.

News January 25, 2025

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం: ఎస్పీ

image

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని జిల్లా ఎస్పీ దామోదర్ సూచించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీసు గ్రౌండ్‌లో ఎస్పీ “ఓటర్స్ డే” ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశంలో 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నమన్నారు.