News July 30, 2024

REWIND: ప్రజల మేస్త్రి.. రావి శాస్త్రి

image

తన మాటలు, రచనలతో ఉత్తరాంధ్ర మాండలిక విశిష్టతను జిల్లాకు చెందిన రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) విశ్వవ్యాప్తి చేశారు. శ్రీకాకుళంలో 1922 జులై 30న జన్మించి, న్యాయవాది వృత్తిలో స్థిరపడి తన వద్దకు వచ్చే క్లయింట్లు, అణగారిన వర్గాలు, పేదల జీవితాలనే తన కథా వస్తువులుగా చేసుకొని ఎన్నో సృజనాత్మక, కవితాత్మక రచనలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్నో పురస్కారాలు, బిరుదులు అందుకున్నారు.

Similar News

News October 8, 2024

కంచిలి: భవానీ సన్నిధానంలో విషాదం

image

కంచిలి మండలం నారాయణ బట్టి గ్రామంలో భవానీ సన్నిధానంలో జరిగిన దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన భవానీ సన్నిధానంలో గ్రామానికి చెందిన కోన మణి (21) అనే భవానీ మాలధారణ చేసిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు గురు స్వామి సూచనలతో భవానీ మాలధారణ చేసిన భక్తులందరూ దీక్ష విరమించుకున్నట్లు వారు పేర్కొన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: ఈ నెల 14వ తేదీన పల్లె పండుగ

image

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ‘పల్లె పండుగ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లుచేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పల్లె పండుగ కార్యక్రమాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

News October 8, 2024

10న YCP శ్రీకాకుళం జిల్లాధ్యక్షుడిగా ధర్మాన ప్రమాణస్వీకారం

image

నరసన్నపేట YCP కార్యాలయంలో ఈ నెల 10న పార్టీ జిల్లాధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డాక్టర్స్ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎంపీపీ మురళి తెలిపారు. నరసన్నపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.