News September 27, 2024

Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!

image

HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్‌ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.

Similar News

News October 28, 2025

మహా ప్రస్థానంలో సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తి

image

మాజీమంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోకాపేటలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై.. మహా ప్రస్థానం వద్ద ముగిసింది. అంతిమయాత్రలో మాజీమంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తల కన్నీటి వీడుకోలు మధ్య సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హరీశ్ రావు తన తండ్రి సత్యనారాయణ రావు చితికి నిప్పంటించి, దహన కార్యక్రమాలు పూర్తి చేశారు.

News October 28, 2025

HYD మెట్రో కోసం మూతబడ్డ మున్షీనాన్

image

మున్షీనాన్.. పాతబస్తీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. 174 ఏళ్లుగా నడిచిన నాన్ షాపును HYD మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఇటీవల తొలగించారు. నిజాం వద్ద క్లర్క్‌గా పనిచేసే మున్షీ ఢిల్లీ వీధుల్లో నిప్పుల కొలిమితో చేసిన చతురస్త్ర ఆకారపు రొట్టెకు ఫిదా అయ్యారు. అచ్చం అలానే చార్మినార్‌లో 1851లో మున్షీనాన్ ఏర్పాటు చేశారు. జనాదరణతో మున్షీనాన్ నగరవ్యాప్తమైంది. 2025 మెట్రో పనుల్లో భాగంగా ఈ దుకాణం కనుమరుగైంది.

News October 28, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష

image

BRS నేతలు మహిళల కన్నీళ్లను కూడా రాజకీయం కోసం వాడుకోవడం దుర్మార్గమని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత అన్నారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో మహిళలను గౌరవించే సంప్రదాయం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష అని పేర్కొన్నారు.