News April 24, 2024

REWIND: మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ ప్రధాని

image

1980 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. ఇక్కడ మొత్తం 4,45,289 ఓట్లు పోల్ కాగా 3,15,077 (67.9) శాతం ఇందిరాకే రావడం విశేషం. ఆమెకు జిల్లాలో విడదీయలేని బంధ ఉంది. ప్రధాని హోదాలో పలుమార్లు జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో జడ్పీ సమావేశంలో, 1984 జులై 19న మెదక్‌లో జరిగిన సర్పంచుల సదస్సులో పాల్గొన్నారు. 1984 అక్టోబరు 31న హత్యకు గురైనప్పుడు మెదక్‌ ఎంపీగానే ఉన్నారు. 

Similar News

News December 4, 2025

మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

News December 4, 2025

మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

News December 4, 2025

మెదక్: 2వ విడత బరిలో 670 మంది అభ్యర్థులు

image

మెదక్ జిల్లాలో రెండవ విడతలో జరగనున్న 8 మండలాల్లోని 149 గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 670 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చేగుంట (134), చిన్న శంకరంపేట్ (113), రామాయంపేట (87) మండలాల్లో అత్యధిక అభ్యర్థులున్నారు. శనివారం నాటి ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.