News April 12, 2025

REWIND: వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ఏం చేశారంటే..

image

రెండేళ్ల క్రితం తన ఇంటి ఎదుట రోడ్డు దాటుతుండగా వనజీవి రాయమ్యను ఓ వ్యక్తి బైక్‌తో ఢీకొట్టాడు. అయితే ప్రమాదానికి కారకుడైన వ్యక్తికి రామయ్య అరుదైన శిక్ష విధించారు. అతడిని క్షమించి కేసు పెట్టకుండా 100 మొక్కలను నాటాలని సూచించారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఒక్క సంఘటన చాలదా వనజీవికి ప్రకృతి అంటే ఎంత ప్రేమో..!

Similar News

News December 8, 2025

మెదక్: చెక్‌పోస్టును సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్

image

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ సూచించారు. సోమవారం మంబోజిపల్లి వద్ద చెక్‌పోస్టును సందర్శించారు. వాహనాల తనిఖీలు, నగదు, వస్తువుల రవాణా, అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయం, సమాచార అంశాలపై పలు సూచనలు చేశారు.

News December 8, 2025

అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు: కలెక్టర్

image

అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ధర, అత్యుత్తమ గుర్తింపు లభించేలా జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కాఫీ రైతులు, వ్యాపారులు, ఎఫ్పీఓలు, ఎన్జీఓలతో సోమవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. జిల్లాలో కాఫీ ట్రేడర్స్ అందరూ కలిసి ట్రేడర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తే, దానికి చట్టబద్ధత కల్పించి, దాని ద్వారా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.

News December 8, 2025

అనంతగిరి: ఆ రెండు గ్రామాలకు నాటు పడవలే దిక్కు

image

అనంతగిరి మండలం పినకోట, జీనబాడు పంచాయతీలకు చెందిన కొత్త బురగా, వలసల గరువు గ్రామాలకు రోడ్డు మంజూరు చేయాలనీ పినకోట సర్పంచ్ ఎస్.గణేష్ డిమాండ్ చేసారు. ఈ గ్రామాలకు రోడ్డు మార్గం లేనందున 3కిలోమీటర్లు నాటు పడవలో ప్రయాణించాలని అన్నారు. ఈ రెండు గ్రామాలలో సుమారు 90 ఆదివాసీ కుటుంబాలు జీవిస్తున్నారన్నారు. ఆ గ్రామాలకి వెళ్లడం కష్టతరంగా ఉందని, ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.